మన వార్తలు ,అమీన్పూర్
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఎనిమిదవ వార్డులో 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో సీసీ రోడ్లు, 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న అంతర్గత మురుగునీటి కాల్వల నిర్మాణం పనులకు మంగళవారం పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్థానిక మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, కౌన్సిలర్ నవనీత జగదీశ్వర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలో ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా పారదర్శకతతో కూడిన పరిపాలన అందిస్తున్నామని తెలిపారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
స్టేడియం నిర్మాణ పనులు పరిశీలన
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ఐదు ఎకరాల సువిశాల విస్తీర్ణంలో చేపడుతున్న పనులను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. మున్సిపల్ పరిధిలో క్రీడల అభివృద్ధి కోసం స్టేడియం ఎంతగానో దోహదం చేస్తుందని తెలిపారు. త్వరితగతిన స్టేడియం పనులు పూర్తిచేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గం క్రీడల కేంద్రంగా మారుస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక కౌన్సిలర్ లు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…