Crime

280 కిలోల గంజాయి పట్టివేత…

280 కిలోల గంజాయి పట్టివేత…
– ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం
– ఇద్దరూ రిమాండ్
పటాన్ చెరు:
ఆంధ్రా, ఒడిశా సరిహద్దుల నుంచి జహీరాబాద్​కు తరలిస్తున్న  గంజాయిని ముత్తంగి టోల్​గేట్​ వద్ద మెదక్ డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. 280 కిలోల గంజాయి, ఓకారును సీజ్​చేశారు. గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా…. జహీరాబాద్ మండలం గోవింద్​పూర్ తండాకు చెందిన బానోతు తులసీరామ్, నాల్కల్ మండలం రామతీర్థకు చెందిన బ్యాగరి తుకారాం… ఆంధ్ర ఒరిస్సా నుంచి జహీరాబాద్​కు గంజాయి తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న మెదక్​ డివిజన్​ ఎక్సైజ్, ఎన్​ఫోర్స్​మెంట్ పోలీసులు… మెదక్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ కేఏబీ శాస్త్రి, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్​ గాయత్రి ఆదేశాల మేరకు సోదాలు నిర్వహించారు.
స్కార్పియో వాహనంలో 140 ప్యాకెట్లలో తీసుకెళ్తున్న 280కిలోల గంజాయిని పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్​ చేసి,ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ మోహన్, ఎక్సైజ్ సిఐ సీతారామిరెడ్డి, ఎస్సైలు విశ్వనాథ్ ,రాజు, ఎక్సైజ్ ఎస్సై వెంకటేశం, ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Venu

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

10 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

10 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

10 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago