నేటి ఆధునిక సమాజం లో సీసీ కెమెరాల ఆవశ్యకత పెరిగిందని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం పటాన్ చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డు ప్రాంగణంలో ఏడు లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన 24 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 14 ఎకరాల్లో విస్తరించిన మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం ద్వారా రైతులకు, వ్యాపారస్తులకు మరింత భద్రత కల్పించినట్లు అయిందన్నారు. ఇప్పటికే మార్కెట్ యార్డులో సిసి రోడ్లు, షెడ్లు, టాయిలెట్లు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మార్కెట్ యార్డ్ మరింత అభివృద్ధి పరిచేందుకు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
దేశంలో భద్రత చాలా ముఖ్యమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ప్రజలను భాగస్వామ్యం చేయడంతో నగరంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని అన్నారు.
నగరంలోని ప్రతి సొసైటీలో సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ హారిక విజయ్ కుమార్, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భానురి మల్లారెడ్డి, డైరెక్టర్లు మల్లికార్జున్, శివారెడ్డి, ప్రమోద్ గౌడ్, వంగరి అశోక్, గౌరీ శంకర్,నారాయణ రెడ్డి, అధికారులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటేష్, షకీల్, అజ్మత్, సాగర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…