_దేశానికి వెన్నెముక యువత
_అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :
యువకులే దేశానికి వెన్నెముక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు సాయి కాలనీలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించే తలపెట్టిన యువజన భవనం నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రమం నుండి మొదలుపెడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు యువకులే కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువజన సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, స్వయం ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రధానంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్ బాలమని బాలరాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
విద్యుత్, మంచినీరు, పరిశుభ్రత అంశాలకు ప్రథమ ప్రాధాన్యత బల్దియా పరిధిలోని ప్రతి ఇంటికి స్వచ్ఛ జలాలు ప్రతి కాలనీలో పచ్చదనం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం అధ్యాపకుల కృషి మరోసారి విద్యారంగ నిపుణుల ప్రశంసలను అందుకుంది. హైదరాబాదులోని గీతం స్కూల్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో బుధవారం వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరుపుకున్నారు. వందేమాతరం…
మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…