_దేశానికి వెన్నెముక యువత
_అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
అమీన్పూర్, మనవార్తలు ప్రతినిధి :
యువకులే దేశానికి వెన్నెముక అని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువత భాగస్వామ్యం పెరగాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అభిప్రాయపడ్డారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 10 వ వార్డు సాయి కాలనీలో 20 లక్షల రూపాయల సొంత నిధులతో నిర్మించే తలపెట్టిన యువజన భవనం నిర్మాణ పనులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సోమవారం ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర సంగ్రమం నుండి మొదలుపెడితే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు యువకులే కీలక పాత్ర పోషించారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యువజన సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడంతోపాటు, స్వయం ఉపాధి రంగానికి ఊతమిచ్చేలా పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ప్రధానంగా ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఆర్థిక అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, స్థానిక కౌన్సిలర్ బాలమని బాలరాజు, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, కాలనీవాసులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…