Telangana

దేశ వ్యాప్తంగా కులగణన కాంగ్రెస్ విజయమే

– దేశానికే దిక్సూచిగా మారిన తెలంగాణ సర్కార్

– జనగణన తో కులగణన ను స్వాగతిస్తున్నాం
నీలం మధు ముదిరాజ్

– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు

– సీఎం నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న నీలం మధు

మనవార్తలు ప్రతినిధి, శేరిలింగంపల్లి :

దేశ వ్యాప్తంగా జరిగే జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం కాంగ్రెస్ పార్టీ విజయమని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు.తెలంగాణలో కులగణనను చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచి దేశవ్యాప్తంగా కులగణనకు బాటలు వేసినందుకు గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి పూల బొకే అందించి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ అన్ని వర్గాలకు సమన్యాయం జరగాలని సదుద్దేశంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీసీ కుల గణన కోసం గొంతు ఎత్తాడని వివరించారు. రాహుల్ గాంధీ సూచనల మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో కులగణన చేపట్టడంతో పాటు అసెంబ్లీలో తీర్మానం చేసి దేశానికి దిశా నిర్దేశం చేస్తూ దారి చూపాడని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిచిందని కొనియాడారు. రేవంత్ రెడ్డి చొరవతోనే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కులగణన కోసం నిర్ణయం తీసుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. జనగణన తో పాటు కుల గణన చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి స్వాగతిస్తున్నామన్నారు. తెలంగాణలో కులగణన చేపట్టిన విధానంలోనే దేశవ్యాప్తంగా చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఇందిరమ్మ తరహాలో తెలంగాణలో పాలనను కొనసాగిస్తూ అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలను యావద్దేశమే గర్విస్తుందన్నారు.బీసీ కుల గణన చేపట్టి అసెంబ్లీ లో బీసీ రిజర్వేషన్లు బిల్లు పెట్టీ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా కుల గణన జరిగేట్లు చర్చ తీసుకుని వచ్చి అనుకున్నది సాధించిన రేవంత్ కు బీసీ వర్గాలు ఋణపడి ఉంటాయన్నారు. బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago