పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 23-24 తేదీలలో ‘ ఆర్ ఉపయోగించి డేటా అనలిటిక్స్’పై రెండు రోజుల కార్యశాలను నిర్వహించినట్టు సమన్వయకర్త టి.అరుణ శ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా , ఐఐటీ – వారణాసిలోని ఇన్నోవియన్స్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ సౌజన్యంతో దీనిని నిర్వహించామన్నారు . ఈ రెండు రోజుల వర్క్షాపులో దాదాపు 68 మంది బీటెక్ సీఎస్ఈ , బీఫార్మశీ విద్యార్థులు పాల్గొని , ఇన్నోవియన్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందినట్టు ఆమె తెలియజేశారు . వర్క్షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు చిన్నపాటి పోటీలను నిర్వహించి విజేతలకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను పంపిణీ చేశామన్నారు . ఈ కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులు ఆరూడియో వినియోగం , ఆర్ ప్యాకేజిని ఉపయోగించడంతో పాటు రియల్టైమ్ ప్రాజెక్టులయిన కోవిడ్ , జొమాటో డేటాలను విశ్లేషించినట్టు అరుణశ్రీ తెలిపారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…