పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 23-24 తేదీలలో ‘ ఆర్ ఉపయోగించి డేటా అనలిటిక్స్’పై రెండు రోజుల కార్యశాలను నిర్వహించినట్టు సమన్వయకర్త టి.అరుణ శ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా , ఐఐటీ – వారణాసిలోని ఇన్నోవియన్స్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ సౌజన్యంతో దీనిని నిర్వహించామన్నారు . ఈ రెండు రోజుల వర్క్షాపులో దాదాపు 68 మంది బీటెక్ సీఎస్ఈ , బీఫార్మశీ విద్యార్థులు పాల్గొని , ఇన్నోవియన్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందినట్టు ఆమె తెలియజేశారు . వర్క్షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు చిన్నపాటి పోటీలను నిర్వహించి విజేతలకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను పంపిణీ చేశామన్నారు . ఈ కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులు ఆరూడియో వినియోగం , ఆర్ ప్యాకేజిని ఉపయోగించడంతో పాటు రియల్టైమ్ ప్రాజెక్టులయిన కోవిడ్ , జొమాటో డేటాలను విశ్లేషించినట్టు అరుణశ్రీ తెలిపారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…