పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :
గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని సీఎస్ఈ విభాగం ఆధ్వర్యంలో డిసెంబర్ 23-24 తేదీలలో ‘ ఆర్ ఉపయోగించి డేటా అనలిటిక్స్’పై రెండు రోజుల కార్యశాలను నిర్వహించినట్టు సమన్వయకర్త టి.అరుణ శ్రీ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు . కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా , ఐఐటీ – వారణాసిలోని ఇన్నోవియన్స్ టెక్నాలజీస్ అండ్ టెక్నిక్స్ సౌజన్యంతో దీనిని నిర్వహించామన్నారు . ఈ రెండు రోజుల వర్క్షాపులో దాదాపు 68 మంది బీటెక్ సీఎస్ఈ , బీఫార్మశీ విద్యార్థులు పాల్గొని , ఇన్నోవియన్స్ నుంచి ధ్రువీకరణ పత్రాలను పొందినట్టు ఆమె తెలియజేశారు . వర్క్షాపు ముగింపు సందర్భంగా విద్యార్థులకు చిన్నపాటి పోటీలను నిర్వహించి విజేతలకు ఎక్సలెన్స్ సర్టిఫికెట్లను పంపిణీ చేశామన్నారు . ఈ కార్యశాలలో పాల్గొన్న విద్యార్థులు ఆరూడియో వినియోగం , ఆర్ ప్యాకేజిని ఉపయోగించడంతో పాటు రియల్టైమ్ ప్రాజెక్టులయిన కోవిడ్ , జొమాటో డేటాలను విశ్లేషించినట్టు అరుణశ్రీ తెలిపారు .
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…