పాశమైలారం పారిశ్రామిక వాడలో భారీ కార్మికుల ప్రదర్శన
అక్రమంగా తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకునే వరకు పోరాటం ఆగదు
సంఘీభావ సభలో వక్తలు
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
బిస్లైన పరిశ్రమలో అక్రమంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, కార్మికులకు న్యాయం చేయాలని, చట్టాలు ఉల్లంఘిస్తున్న యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గత 45 రోజులుగా సమ్మె చేస్తున్న బిస్లరీ కార్మికుల పోరాటానికి సంఘీభావంగా శనివారం పటాన్ చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామిక వాడలో కార్మికుల భారీ ప్రదర్శన నిర్వహించారు.పాశమైలారం ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ బిస్లరీ యూనియన్ అధ్యక్షులు అతిమేల మానిక్ అధ్యక్షతన సంఘీభావ సభను నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా కార్యదర్శి జి సాయిలు, జిల్లా కోశాధికారి కే రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పి పాండురంగారెడ్డి, పి.భాగారెడ్డి మాట్లాడుతూ బిస్లి యాజమాన్యం చట్టాలను ఉల్లంఘిస్తుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదని మండిపడ్డారు. కార్మికులు చట్టబద్ధంగా యూనియన్ పెట్టుకోవడమే నేరమా అని ప్రశ్నించారు.
శాంతియుతంగా గత 45 రోజులుగా సమ్మె చేస్తుంటే యాజమాన్యం ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి కార్మికులను భయభ్రాంతులకు గురి చేయటం ఎంతవరకు న్యాయమన్నారు. పట్టుదలతో పోరాడుతున్న బిస్లరీ కార్మికులకు జేజేలు అని అన్నారు. బిస్లరీ కార్మికులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదని హెచ్చరించారు. బిస్లరీ కార్మికులకు మద్దతుగా జిల్లాలోని కార్మికులను కదిలించి పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. తొలగించిన కార్మికులను వెంటనే తీసుకోవాలని, యజమాన్యం దిగివచ్చి చర్చలు జరిపి వేతన ఒప్పందం చేయాలని డిమాండ్ చేశారు.సంఘీభావ కార్మికుల ప్రదర్శన సభలో వివిధ యూనియన్లు నుండి మద్దతు లభించింది.
సాండ్విక్ యూనియన్ జనరల్ సెక్రెటరీ ప్రదీప్, కిర్బి ఉపాధ్యక్షులు మల్లేష్, సెనర్జీ జనరల్ సెక్రెటరీ శాంత్ కుమార్, సిబిఎల్ జన సెక్రటరీ ప్రసన్న, కోహెన్స్ ఫార్మా జనరల్ సెక్రెటరీ వెంకటేష్, పార్లే జన సెక్రెటరీ సంతోష్ గౌడ్, నీయఫ్ నాయకులు శంకర్, హిమ్ జల్ దామోదర్, టిఐడిసి వెంకటేష్, ప్రజానాట్యమండలి అధ్యక్షులు రాజు, కార్యదర్శి నాగభూషణం సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్ నాయకులు విట్టల్, తలారి శ్రీనివాస్, జైపాల్, మహేశ్వర్ రెడ్డి, లకన్, చంద్రయ్య, ప్రభు, బిస్లరి యూనియన్ జన సెక్రెటరీ శేఖర్ రెడ్డి, నవీన్, నాగరాజు, ప్రవీణ్, సతీష్, అజయ్ వివిధ యూనియన్ల కార్మికులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…