విద్యలో కొత్త ఆలోచనలు, ఉన్నతాశయాలతో ఆధునిక పోకడలను ప్రవేశపెట్టాలని అభికసించే మాధ్యమిక విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్ చెప్పారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హెదరాబాద్లో బుధవారం నిర్వహించిన ‘భారతీయ విద్యా నాయకత్వ సమ్మేళనం’ను ఉద్దేశించి ఆయన వర్చువల్ గా ప్రసంగించారు.భారతదేశ నలుమూలల నుంచి వచ్చిన వివిధ సీబీఎస్ఈ పాఠశాలలు, ఐబీ స్కూల్స్, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లను ఉద్దేశించిన మాట్లాడుతూ, తాము లిబరల్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యం ఇస్తున్నామని , కలిసోచ్చే పాఠశాలలతో కలిసి పయనించడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. కృత్రిమ మేథ వల్ల ఇటీ రంగంలోని చాలా ప్రాథమిక స్థాయి ఉద్యోగాలు రానున్న రెండు మూడేళ్లలో కోల్పోతామని, అందువల్ల విద్యార్థుల సంపూర్ణ పరిణితికి బాటలు వేసి లిబరల్ ఎడ్యుకేషన్ వెపు రాము జాతీయ విద్యా విధానం-2020 కంటే ముందు అడుగేసినట్టు చెప్పారు. తమ విద్యార్థులు నైపుణ్యం గలవారిగా ఎదగడానికి కృషిచేస్తున్నట్లు చెప్పారు.
అందుకు అనుగుణంగా పరిశోధన, నాణ్యత గల అధ్యాపకులు, ప్రపంచ శ్రేణి తరగతి గదులు, ప్రగతిశీల వాతావరణాన్ని తమ వర్సిటీలో సృష్టించేందుకు అధిక మొత్తంలో నిధులను వెచ్చిస్తున్నట్టు శ్రీభరత్ చెప్పారు.గీతం ప్రయోగశాలలను సందర్శించమని సదస్సులో పాల్గొన్న ప్రిన్స్ పాళ్లందరికీ ఆయన సూచించారు. కౌటిల్యా స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ద్వారా విధాన నిర్ణయంలో మాస్టర్స్ ప్రోగ్రాము నిర్వహిస్తూ, ప్రపంచ స్థాయి విద్య ఆవశ్యకతను చాటిచెబుతున్నామన్నారు.ఈ సందర్భంగా, ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్స్, స్టెమ్ను ఏకీకృతం చేసి వినూత్న మార్గాలను అన్వేషించ డంతో పాటు ఉన్నత విద్యలో ఆవిష్కరణలపై ప్యానెల్ చర్చను నిర్వహించారు. ఈఎంఐ సర్వీసెస్ ఇండియా సహ-వ్యవస్థాపకురాలు లక్ష్మీ అన్నపూర్ణ ఈ సందర్భంగా ప్రసంగించారు.తొలుత, గీతం హెదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు స్వాగతోపన్యాసం చేశారు. వ్యవస్థాపకులుగా విద్యార్థులు ఎదిగేందుకు గీతం చేపట్టిన పలు చర్యలను వివరించడంతో పాటు, నచ్చే వేసవిలో విద్యార్థుల కోసం ఉచితంగా సమ్మర్ స్కూల్ ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.గీతమ్ లోని వివిధ స్కూళ్ల డెరైక్టర్లు తాము నిర్వహిస్తున్న కోర్సులు, ఇతరత్రా వివరాలను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఒకరోజు కార్యక్రమం ఆహ్లాదకరమైన భోజనంతో ముగిసింది.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…