_అధికారికంగా కొనసాగుతున్న బతుకమ్మ సంబరాలు
_బతుకమ్మ సంస్కృతిని చాటే విగ్రహంపై మాయమైన బతుకమ్మ
మనవార్తలు ,పటాన్ చెరు:
బతుకమ్మ పండుగ సంబరాలను అధికారికంగా తెలంగాణ సర్కారు నిర్వహిస్తున్నది. బతుకమ్మ తెలంగాణ సాంస్కృతికి ప్రతీక అని జాగృతి వంటి సంస్థలు దేశ, విదేశాల్లో బతుకమ్మ ఆటలు ఆడి మన సంస్కృతిని పరిచయం చేస్తున్నాయి.రాష్ట్రంలో బల్దియాలకు బతుకమ్మ పండుగ ఘనంగా చేసేందుకు నిధులు సైతం మంజూరవుతున్నాయి. సర్కారు బతుకమ్మ పండుగ కోసం మహిళలకు చీరలు సైతం పంపిణీ చేస్తున్నది. ఇంత విశిష్టత కలిగిన బతుకమ్మ పండుగకు సదాశివపేట అధికారులు సిద్ధం కాలేదు. రూ.6 కోట్ల నిధులతో సదాశివపేటలో 65వ జాతీయ రహదారి పక్కనే ఉన్న ఊబ చెరువును (మినీ ట్యాంక్ బండ్)గా సుందరీకరించారు. మినీ ట్యాంక్ బండ్ పైన తల్లి, కూతురు బతుకమ్మ ఎత్తుకుని స్వాగతం పలుకుతున్న శిలా విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ శిలా విగ్రహాల తలపై నుంచి బతుకమ్మలు మాయమయ్యాయి. ఆకతాయిలు చేసిన పనిగా భావిస్తున్నారు. నెలలు గడుస్తున్నా తల్లి విగ్రహం తలపై బతుకమ్మ లేకుండానే విగ్రహం దర్శనమిస్తున్నది. తెలంగాణ సంస్కృతిని చాటే బతకమ్మలే గల్లంతైన సంగతి తెలిసినా అధికారులు మరమ్మతు చేసి ఆ విగ్రహంపై కొత్త బతుకమ్మలను ప్రతిష్టించే ఆలోచన చేయట్లేదు. విగ్రహాలను పట్టించుకోకపోవడం మన సంస్కృతిని అవమానించడమేనని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నవరాత్రులు ప్రారంభమై ఆడపడుచులు బతుకమ్మలు ఆడుతున్న ఇంకా అధికారులు రంగులు తేలిపోయిన విగ్రహాలకు రంగులు పూసి గల్లంతైన బతుకమ్మ స్థానంలో కొత్త బతుకమ్మలను పెట్టకపోవడం నిరసనలకు కారణం అవుతున్నది.
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…