పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
పటాన్చెరు డివిజన్ పరిధిలో ఇటీవల మూతపడిన ఇంపీరియల్ గార్మెంట్స్ పరిశ్రమ మహిళా కార్మికులకు ప్రభుత్వపరంగా సంక్షేమ పథకాలు అందించడంతోపాటు, ఈఎస్ఐ నుండి రావలసిన బకాయిలు త్వరితగతిన ఇప్పించేందుకు కృషి చేస్తామని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హామీ ఇచ్చారు.ఆదివారం పరిశ్రమ మహిళా కార్మికులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. పరిశ్రమ మూసివేసిన సందర్భంలోనూ ప్రతి కార్మికురాలికి మూడు లక్షల రూపాయలకు పైగా పరిహారం అందించామని తెలిపారు.రాబోయే రోజుల్లోనూ ప్రభుత్వపరంగా ప్రతి సంక్షేమ పథకాన్ని వర్తింపజేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి యాదవ్, తదితరులు పాల్గొన్నారు..
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…