పటాన్చెరు
విజయదశమి వేడుకలు పటాన్చెరు పట్టణంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట గల బుద్ధుడి విగ్రహం వద్ద పతాక ఆవిష్కరణ నిర్వహించారు.. అనంతరం ఉత్తర దిక్కున గల జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ లో పురోహితుల సమక్షంలో శమీ పూజ నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు జమ్మి ఆకును ఇచ్చిపుచ్చుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ తరతరాలనుండి వస్తున్న సాంప్రదాయాలకు అనుగుణంగా పటాన్చెరు పట్టణంలో దసరా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మాజీ శాసన సభ్యులు సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, మాజీ జెడ్ పి టి సి జైపాల్, మాజీ కార్పొరేటర్లు సపాన దేవ్, శంకర్ యాదవ్, మాజీ సర్పంచ్ దేవేందర్ రాజు, పట్టణ పుర ప్రముఖులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే జీఎంఆర్ కు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
విజయ దశమిని పురస్కరించుకుని నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నివాసం అభిమానులతో సందడిగా మారింది.
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…
సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం ప్రజల…
తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…
టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: సిపిఎస్ విధానం రద్దు…
మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…
గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…