politics

బచ్చుగూడలో ప్రజా పాలన విజయోత్సవాలు

ప్రజా అవసరాల పరిష్కారమే మా ఎజెండా_ కాట శ్రీనివాస్ గౌడ్

ఇచ్చిన హామీలకు మించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం

నీలం మధు ముదిరాజ్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. శనివారం పటాన్ చెరు మండలం బచ్చుగూడ గ్రామపంచాయతీ పరిధిలో పటాన్చెరు నియోజకవర్గ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్టు సాయి కుమార్, నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ గార్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేండ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏడాదిలోనే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని విడతల వారీగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీని పూర్తి చేశామని, సంక్రాంతి సందర్భంగా పెట్టుబడి సహాయమైన రైతు భరోసాను సైతం జమ చేస్తామని తెలిపారు. పదేండ్ల పాటు గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికొదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోనే 50 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కొనియాడారు. దేశంలో ఎక్కడ లేని విధంగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.

బీఆర్ఎస్ పాలనను తెలంగాణ అస్తిత్వానికి జరిగిన అన్యాయాన్ని సరి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతోందని దశలవారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ తెలంగాణను అభివృద్ధిలో అగ్రగామిగా మార్చుతామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో టిపిసిసి మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట సుధారాణి, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

6 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

2 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago