మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు:
పఠాన్ చేరు నియోజకవర్గం, అమిన్ పూర్, బీరంగూడ డివిజన్ పరిధిలో ఉన్న శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహించారు, అనంతరం ఇరువురు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే తొమ్మిది రోజులు అత్యంత శక్తివంతమైన ‘వారాహి నవరాత్రులు’ వారాహీ అమ్మవారి అనుగ్రహం కోసం భక్తులు విశేషంగా ఆరాధించే పర్వదినాలివి.
అమ్మవారి అలంకార విశేషాలు
ఎర్రటి వస్త్రాలు,ఎర్ర పూలు వారాహీ మాత ఉగ్ర మరియు శాంత స్వరూపిణి. ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఎర్రటి లేదా పసుపు రంగు పట్టు వస్త్రాలు సమర్పించి, ఎర్రమందారాలు, గులాబీలు మరియు కనకాంబరాల మాలలతో అద్భుతంగా అలంకరిస్తారు.పసుపు, కుంకుమల అర్చన: అమ్మవారిని రోజూ పసుపు, కుంకుమ మరియు గంధంతో సర్వాంగ సుందరంగా శృంగారించి కుంకుమార్చనలు నిర్వహిస్తారు.శాకాంబరీ అలంకారం: ఆషాఢ నవరాత్రులలో పండ్లతో, రకరకాల తాజా కూరగాయలతో అమ్మవారిని ‘శాకాంబరీ దేవి’ రూపంలో అలంకరించడం అత్యంత విశేషం.
వివిధ రూపాలు (నవ అలంకారాలు): తొమ్మిది రోజులు అమ్మవారిని 1}ఆది వారాహి,2}బృహద్ వారాహి, 3}స్వప్న వారాహి, 4}ధూమ్ర వారాహి, 5}కిరాత వారాహి,6} ఉన్మత్త వారాహి, 7}లఘు వారాహి, 8}అశ్వారూఢ వారాహి,9} మహా వారాహి వంటి వివిధ శక్తుల రూపాల్లో అలంకరించి ఆరాధిస్తారు. భక్తులు వందలాదిగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు, ప్రతిరోజు దేవాలయంలో ప్రచారకర్త డాక్టర్ మహంతయ్య శర్మ ఆధ్వర్యంలో ప్రవచనాలు నిర్వహించారు, రేపు ఉదయం 10 గంటలకు దేవాదాయ శాఖ కమిషనర్ పిలుపు మేరకు వరుణ యాగం మరియు వరుణ హోమం నిర్వహించబడుతుంది, యాగం వలన సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు పండి అందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని వేడుకున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్,ఆలయ ఈవో దేవనాదం, సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున రెడ్డి, ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి,రామచంద్రపురం: పటాన్చెరు నియోజకవర్గంలోని ఆర్సీ పురం 268 డివిజన్లో బీఆర్ఎస్ పార్టీ తరపున బస్తీ దర్శన్ కార్యక్రమాన్ని సంగారెడ్డి…
మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: తెలంగాణ సంస్కృతిలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం ఉంది అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్…
ముత్తంగిలో ఘనంగా విశ్వభారతి కాలేజ్ ఆఫ్ లా నూతన భవనం ప్రారంభం మనవార్తలు ప్రతినిధి,పటాన్చెరు: ప్రతి పౌరుడు రాజ్యాంగాన్ని తప్పనిసరిగా…
మనవార్తలు ప్రతినిధి ,గుంటూరు : గుంటూరు అంటేనే రుచులకు నిలయం. తాజాగా గుంటూరు ప్రజలకు సరికొత్త రుచిని అందిస్తూ హియ్య…
పెంపుడు జంతువుల ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడమే లక్ష్యం మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : భారతదేశపు తొలి ఓమ్నీచానెల్ జిగ్లీ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్ : అద్భుతమైన డిజైన్లతో రూపొందించిన రత్నాలు, బంగారు వజ్రాభరణాల ప్రత్యేక కలెక్షన్స్ సాంప్రదాయక వైభవాన్ని, ఆధునిక…