పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఔట్ రీచ్ లో భాగంగా, బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులకు ఆర్కిటెక్చర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహించారు. ముఖాముఖి, కొన్ని ప్రయోగాత్మక కార్యకలాపాలతో పాటు గీతం హైదరాబాద్ ప్రాంగణ సందర్శనను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్కిటెక్చర్ రంగంలో విలువైన అంతర్దృష్టులను అందించం, వారిలో ఉత్సుకతను పెంపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు.ఆర్కిటెక్చర్ అధ్యాపకులు అభిషేక్ కుమార్ సింగ్, స్నిగ్దా రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా అవగాహన, సృజనాత్మక స్ఫూర్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన ఆకర్షణీయమైన కార్యకలాపాలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. డిజైన్ సూత్రాలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, కమ్యూనిటీలను రూపొందించడంలో ఆర్కిటెక్చర్ యొక్క సామాజిక పాత్రతో సహా వాస్తు విద్య, దాని అభ్యాసం యొక్క ముఖ్య అంశాలను వారికి వివరించారు.ఈ చొరవ విద్యార్థులకు వాస్తుశిల్పం పట్ల ఆసక్తిని రేకెత్తిచడమే గాక, సమాజం, పర్యావరణంపై నిర్మాణాల గణనీయమైన ప్రభావం గురించి స్పష్టమైన అవగాహనను కల్పించింది.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…