పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఔట్ రీచ్ లో భాగంగా, బాచుపల్లిలోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషన్ స్కూల్ విద్యార్థులకు ఆర్కిటెక్చర్ పై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బుధవారం గీతం స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో నిర్వహించారు. ముఖాముఖి, కొన్ని ప్రయోగాత్మక కార్యకలాపాలతో పాటు గీతం హైదరాబాద్ ప్రాంగణ సందర్శనను కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఆర్కిటెక్చర్ రంగంలో విలువైన అంతర్దృష్టులను అందించం, వారిలో ఉత్సుకతను పెంపొందించడం లక్ష్యంగా దీనిని నిర్వహించారు.ఆర్కిటెక్చర్ అధ్యాపకులు అభిషేక్ కుమార్ సింగ్, స్నిగ్దా రాయ్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యా అవగాహన, సృజనాత్మక స్ఫూర్తిని ప్రోత్సహించడానికి రూపొందించిన ఆకర్షణీయమైన కార్యకలాపాలతో విద్యార్థులను ఉత్సాహపరిచారు. డిజైన్ సూత్రాలు, స్థిరమైన నిర్మాణ పద్ధతులు, కమ్యూనిటీలను రూపొందించడంలో ఆర్కిటెక్చర్ యొక్క సామాజిక పాత్రతో సహా వాస్తు విద్య, దాని అభ్యాసం యొక్క ముఖ్య అంశాలను వారికి వివరించారు.ఈ చొరవ విద్యార్థులకు వాస్తుశిల్పం పట్ల ఆసక్తిని రేకెత్తిచడమే గాక, సమాజం, పర్యావరణంపై నిర్మాణాల గణనీయమైన ప్రభావం గురించి స్పష్టమైన అవగాహనను కల్పించింది.
గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక మంచి ఆవిష్కరణ…
మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్చెరు…
పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం డీమ్డ్…
54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…
వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు…