Districts

కార్మికులకు అండగా టిఆర్ఎస్ ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు

కార్మికుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం పాటు పడుతోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదినం సందర్భంగా పటాన్చెరు మండల పరిధిలోని పోచారం గ్రామంలో పార్కర్ పరిశ్రమలో పనిచేస్తున్న 71 మంది కార్మికులకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శాసనమండలి చైర్మన్ భూపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రసంగిస్తూ మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ కార్మిక నాయకుడిగా యాజమాన్యాన్ని ఒప్పించి 71 మంది కార్మికులకు ఇళ్లస్థలాలు ఇప్పించడం అభినందనీయమన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కోతలు లేని విద్యుత్ అందించడం మూలంగా మూడు షిఫ్టుల్లో పరిశ్రమలు నడుస్తున్నాయని అన్నారు. కార్మికుల సంక్షేమానికి వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందన్నారు.

ఆసియాలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడగా పేరొందిన పటాన్చెరు నియోజకవర్గంలో నూతన పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ఉత్సాహం చూపుతున్నారు. సుల్తాన్పూర్ మెడికల్ డివైస్ పార్కుతో పాటు, శివనగర్ పరిధిలో ఏర్పాటుచేసిన ఎల్ఈడి పార్క్ ద్వారా వేలాది ఉద్యోగాలు లభించనున్నాయని పేర్కొన్నారు. కార్మిక పక్షపాతి గా పేరొందిన మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవేందర్ రాజు, ఆదర్శ్ రెడ్డి, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

10 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

11 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

11 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

11 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

11 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

11 hours ago