మనవార్తలు ,శేరిలింగంపల్లి :
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు మియపూర్ డివిజన్ పరిధిలోని మక్తా మహబూబ్ పెట్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు. అర్పించారు. నేటి యువత ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానానికి అనుగుణంగా స్వాతంత్రం అనంతరం దేశంలో అత్యధిక శాతం కలిగిన బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులను పొందుపరిచిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందికి ఆరాధ్య దైవంగా అంబేద్కర్ మారారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు, ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, జాజెరావు శ్రీను, జాజే రావు, రాము, రామకృష్ణ, గంగారo మల్లేష్, సోనూ కుమార్ యాదవ్, శ్రీధర్, దుర్గేష్, నరేష్, సతీష్, రమేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…