Hyderabad

సెప్టెంబర్ 2వ తేదీన ప్రతి గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయాలి

పటాన్చెరు:

సెప్టెంబర్ 2వ తేదీన నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ జెండా పండుగ నిర్వహించాలని పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం పటాన్చెరు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఎమ్మెల్యే జిఎంఆర్ అధ్యక్షతన నియోజకవర్గస్థాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రెండో తేదీన నిర్వహించే జెండా పండుగ, పార్టీ సంస్థాగత నూతన కమిటీ లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆదేశాల మేరకు సెప్టెంబర్ 2వ తేదీ ఉదయం 9 గంటల నుండి 11 గంటల మధ్య ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగురవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరూ పాల్గొనేలా చూడాలని సూచించారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా పార్టీ జెండా పండుగ నిర్వహించలేక పోయామని, ఈ సంవత్సరం ఆనందోత్సాహాల మధ్య పండుగ వాతావరణంలో ప్రతి కార్యకర్త పాల్గొని కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 3వ తేదీ నుండి 10వ తేదీ వరకు పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపల్ నూతన కమిటీలను ఎన్నుకోవాలి ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన మహత్తర బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నుముక అన్నారు. మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి బలం అని, కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలె చూసుకునే ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హారిక విజయ్ కుమార్, ఎంపీపీలు ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి, సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జెడ్ పి టి సి సుధాకర్ రెడ్డి, కుమార్ గౌడ్, సుప్రజా వెంకట్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్లు పాండురంగారెడ్డి, కార్పొరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, పుష్ప నగేష్, పార్టీ గ్రామ, మండల, డివిజన్, మున్సిపాలిటీల అధ్యక్షులు అఫ్జల్, పాండు, తలారి రాములు, ఈర్ల రాజు, పరమేష్ యాదవ్, దేవేందర్ యాదవ్, రాజేష్, నరేందర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, వెంకటేష్ గౌడ్, మల్లారెడ్డి, కార్యవర్గ సభ్యులు అనుబంధ సంఘాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

3 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

3 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

3 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago