అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే…
పటాన్ చెరు:
నియోజకవర్గ పరిధిలోని గ్రామాల మధ్య అనుసంధాన రహదారుల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం పటాన్చెరు మండలం నందిగామ గ్రామంలో కోటి 80 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నందిగామ నుండి బానూరు వరకు నిర్మించనున్న బిటి రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేయనున్న ఆర్చి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల మధ్య అనుసంధాన రహదారులు నిర్మించడం ద్వారా దూర భారం తగ్గడంతోపాటు అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతాయని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా ఇప్పటికే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమావతి గోపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, వెంకట్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…