Lifestyle

పాలనా పునాదులను గుర్తెరగాలి

_గీతం ఆతిథ్య ఉపన్యాసంలో ప్రొఫెసర్ మైఖేల్ సి. విలియమ్స్

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలనేది అందరికీ తెలిసుండాలని, పాలనా పునాదులను గుర్తెరగాలని ప్రొఫెసర్ మైఖేల్ సి.విలియమ్స్ అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ ఎస్ )లోని పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో ‘ది జ్యామెట్రీ ఆఫ్ జస్టిస్: యాన్ ఒడస్సీ ఇన్ ఫ్రాక్టల్ పాలిటిక్స్’ అనే అంశంపై సోమవారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు. కొలరాడో (అమెరికా)లోని డెన్వార్ కి చెందిన మైఖేల్ రచయిత, వ్యవస్థాపకుడు, న్యాయవాది, పెట్టుబడిదారు, పరోపకారిగా పేరొందారు. పాలన, రాజకీయ నిర్మాణాలపై తన దృక్కోణాలను గీతం విద్యార్థులతో పంచుకున్నారు. డాక్టర్ విలయమ్స్ ప్రసంగం కేవలం విద్యాపరంగానే కాక, సాంప్రదాయిక వివేకాన్ని సవాలు చేయడం, పాలనా నిర్మాణాల యొక్క క్లిష్టమైన పూనం మూల్యాంకాన్ని ప్రేరేపించేలా సాగింది. తద్వారా సంభావ్య ప్రభావం ప్రజాస్వామ్య వ్యవస్థలపై మన అవగాహనను పునర్నిర్మించడమే గాక మరింత న్యాయమైన, సమానమైన , సమతుల్య రాజకీయ సంస్థల వెపు స్పష్టమైన మార్గాలను అందించింది.
ఆధునిక, పురాతన అధికారాల విభజనపై డాక్టర్ విలియమ్స్ దృష్టి సారిస్తూ, ఆధునిక కాలంలో కార్యనిర్వాహక, శాసన, న్యాయపరమైన అధికారాల త్రయాన్ని నొక్కి చెప్పారు.

అయితే రాచరికం, కులీనత, ప్రజాస్వామ్యం అనే పాత త్రైపాక్షిక విభజనతో ఆయన విభేదించారు. ప్రజాస్వామ్యం, శాసనం, సమాఖ్య అంశాలకు అనుగుణంగా కార్యనిర్వాహక, శాసన, ప్రజాస్వామ్యం, రాచరికం, న్యాయవ్యవస్థ, కులీనత అంశాలతో కూడిన ‘క్యూబిక్’ రాజ్యాంగం భావన చుట్టూ ఆయన చర్చ సాగింది. విలియమ్స్ తన ప్రభావవంతమైన పుస్తకం ‘అమెరికా ఆన్ ట్రయల్’ నుంచి ఒక సంచలనాత్మక దృక్పథాన్ని అందించారు. రాజకీయ సంస్థ కోసం కొత్త సిద్ధాంతిక ఫ్రేమ్ వర్క్ ను రూపొందించడమే గాక, అది పాలనా విధానాన్ని విప్లవాత్మకంగా మార్చగలదని ఆయన విశ్వసించారు. కార్యనిర్వాహక, శాసన, న్యాయ, రాచరికం, కులీనత, ప్రజాస్వామ్యం, సమాఖ్య, రాష్ట్ర, స్థానిక అంశాలను పాలనకు ప్రాథమికమైనవని ప్రొఫెసర్ విలియమ్స్ నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు లేవనెత్తిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. జీఎస్ హెచ్ ఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ గోస్మాన్ జోస్ అతిథిని సత్కరించారు. రాజనీతి శాస్త్ర విభాగం సమన్వయకర్త డాక్టర్ మయాంక్ మిశ్రా అతిథిని స్వాగతించి, విద్యార్థులకు పరిచయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అశోక్ గుర్రం వందన సమర్పణతో ఈ ఆతిథ్య ఉపన్యాసం ముగిసింది. ఈ చర్చ ఒక ప్రత్యేకమైన, భిన్న దృక్కోణం నుంచి రాజకీయ నిర్మాణాలను ఆలోచింపజేసేదిగా కొనసాగింది.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago