నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్
అమీన్పూర్
బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట అవుటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి పనులు పూర్తి కావచ్చాయని, అతి త్వరలో రహదారిని ప్రారంభించనున్నట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం అమీన్పూర్ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్ లతో కలిసి రహదారి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా 50 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో వంద ఫీట్ల రహదారి నిర్మిస్తున్నట్లు తెలిపారు. రహదారి నిర్మాణం పూర్తయితే ఇటు అమీన్పూర్ మున్సిపల్ తో పాటు అటు అమిన్ పూర్ మండల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు అభివృద్ధిని అడ్డుకునేలా విమర్శలు చేయకుండా గుణాత్మకమైన సూచనలు ఇవ్వాలని కోరారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ డి ఈ దీపక్, తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…