Telangana

టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉంది

– నీడ్స్ రిసోసెర్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ప్లంబింగ్ డే సెలబ్రేషన్స్

శేరిలింగంపల్లి,మనవార్తలు ప్రతినిధి :

ప్రపంచ వ్యాప్తంగా టెక్నీకల్ వర్కర్లకు మంచి డిమాండ్ ఉందని మాజీ క్రెడాయి అధ్యక్షులు, ఐ జి బి సి హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ శేఖర్ రెడ్డి అన్నారు. ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్, టి ఎన్ జి ఓ కాలనిలో ఏర్పాటు చేసిన వరల్డ్ ప్రంబింగ్ డే సెలబ్రేషన్స్ కు ఆయన ముఖ్యాతిగా హాజరై మాట్లాడుతు జర్మనీ లాంటి దేశాల్లో కూడా ప్లంబర్లకు లైసెన్స్ లున్నాయని, లైసెన్స్ లేని ఏ టెక్నీషియన్ ను కూడా ఏ పని చేయనీయరని, ఇంజనీర్ ల కంటే కూడా వీరికే డిమాండ్ ఉందన్నారు. టెక్నీకల్ వర్కర్ల కొరత చాలా ఉందని, టెక్నీకల్ వర్కర్లకు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ తో పాటు, మరో పదిమంది కి ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు. ఇంజనీరింగ్ చదివిన వారు కేవలం 15 శాతం మంది మాత్రమే ఇంజనీరింగ్ జాబ్ చేస్తున్నారని, మిగతా వారు వేరే వేరే రంగాల్లో పని చేసుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వం కూడా టెక్నీకల్ వర్కర్ల కోసం ప్రత్యేక చొరవ తీసుకొని ట్రేనింగ్ ఇవ్వడానికి ఇతర సంస్థలతో అనుసంధానం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ముఖ్యంగా ప్లంబింగ్ వారి అవసరం చాలా ఉందని, హైదరాబాద్ లాంటి నగరంలో గేటెడ్ కమ్యూనిటీ లు పెరిగాయని, వాటిలో వీరి అవసరం ఎంతైనా ఉందన్నారు. వీరి కోసం వేడుక చేసుకోవడం అభినందించదగ్గ విషయమని తెలిపారు.

రాంఖి ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ ఎం. డి. నందకిశోర్ మాట్లాడుతు ప్లంబర్స్ అందరికి శుభాకాంక్షలు తెలిపారు. వీరి పాత్ర అమూల్య మైందని పేర్కొన్నారు. నీడ్స్ రిసో సెర్స్ ఎం. డి పి. ఎస్. రెడ్డి మాట్లాడుతు ప్లంబింగ్ వ్యవస్థ అనేది 5 వేల సంవత్సరాలనుండే ఉందని, అనేకమంది పురావస్తు శాస్త్ర వేత్తలు కనిపెట్టారని, పిరమిడ్ లలో కూడా కాపర్ పైపుల తో చేసిన ప్లంబింగ్ గుర్తులున్నాయని, కాలక్రమేణా అనేక మార్పులు చెందుతు వస్తుందని తెలిపారు. ప్లంబింగ్ వర్క్ వస్తే ప్రపంచంలో ఎక్కడైనా ఉపాధి పొందవచ్చని తెలిపారు. ఎక్కువ మంది సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ అంటూ అటు వైపు వెళ్తున్నారని, కానీ వీరికున్న డిమాండ్ మరెవరికి లేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ప్లంబింగ్ డే చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, మొత్తం 19 సైట్లలో 150 ప్లంబర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ సందర్బంగా పనిలో మంచి ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు. ఈ కార్యక్రమం లో ప్లంబింగ్ వర్కర్స్ కో ఆర్డినేటర్ రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

కిష్టారెడ్డిపేట కేంద్రంగా నూతన డివిజన్ ఏర్పాటు చేయకపోతే ఛలో బల్దియా

అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…

7 hours ago

కిష్టారెడ్డిపేట జి.హెచ్.ఎం.సి డివిజన్ ఏర్పాటు చేయాలి తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్టుశ్రీధర్

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…

7 hours ago

వడ్డే ఓబన్న పోరాటం గొప్పది: నీలం మధు ముదిరాజ్

చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ప్రజల…

7 hours ago

ప్రజల పై మల్లన్న స్వామి ఆశీస్సులు ఉండాలి: నీలం మధు ముదిరాజ్

రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్  మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…

7 hours ago

శ్రామిక సంక్షేమ కేంద్రం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…

7 hours ago

పరిశ్రమ సంసిద్ధతపై కార్యశాల

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…

2 days ago