Telangana

గీతమ్ లో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లో మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా, కృష్ణ తజ్ఞతాపూర్వకంగా నిర్వహించారు. యువతను సన్మార్గంలో నడుపుతూ, భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేలా. అంకితభావంతో పనిచేస్తున్న విద్యావేత్తలను ఈ సందర్భంగా సత్కరించారు. గౌరవప్రదమైన అధ్యాపకులకు స్పా దయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడానికి పలు కార్యక్రమాలను నిర్వహించారు.మనదేశంలో ప్రతియేటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటారు. ఇది ప్రఖ్యాత తత్వవేత్త, పండితుడు, భారత రెండవ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినాన్ని సూచిస్తుంది. విద్యార్థుల జీవితాలతో ఉపాధ్యాయులు చేసిన అమూల్యమైన సేవలను ఈరోజున స్మరించుకోవడం పరిపాటిగా మారింది.గీతం హెదరాబాద్ అధ్యాపకులకు కలకాలం గుర్తుండిపోయేలా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రత్యేకంగా నిర్వహించి, వారి సేవలను గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనల ద్వారా వారి ప్రతిభను ప్రదర్శించారు.విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషిస్తున్న అధ్యాపకులకు గీతం, హెదరాబాద్ అధనపు ధపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. విద్యార్థుల అంకితభావం, ఆభిరుచి, అచంచలమైన నిబద్ధత మనందరికీ స్పూర్తినిస్తాయని, ఈ కార్యక్రమ నిర్వహణలో వారి అమూల్యమైనసహకారం గర్వించదగినదని అన్నారు.

గీతం స్కూల్ ఆఫ్ సెర్చ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ దత్తాత్రి కె.నగేష్, స్వాగత వచనాలతో అరంభమైన ఈ వేడుకలలో అధ్యాసకులు, విద్యార్థులు కలిసి మధుర క్షణాలను పెంచుకున్నారు. తేనీటి నిందుతో ఈ వేడుకలు ముగినాయి.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago