Telangana

చిరుధాన్యాల ద్వారా స్థిరమైన పోషణ, ఆరోగ్యం గీతం కార్యశాలలో వక్తలు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

చిరుధాన్యాలు (మిల్లెట్లు), నిర్లక్ష్యానికి గురై ఇప్పటివరకు ఉపయోగించని ఇతర జాతుల వినియోగం ద్వారా స్థిరమైన పోషణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించవచ్చని వక్తలు అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘వ్యవసాయ-ఆహార పర్యావరణ వ్యవస్థలో చిరుధాన్యాలు, తినదగిన అడవి జాతులను ప్రధాన స్రవంతిలోకి తేవడం’ అనే అంశంపై సోనువారం కార్యశాల నిర్వహించారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ (సీహెచ్ఎడబ్ల్యూఐ), బ్రిటన్ లోని, కోవెంట్రీ విశ్వవిద్యాలయంలోని సెంటర్ ఫర్ అగ్రోకాలజీ, వాటర్ అండ్ రెసిలెన్స్ సంయుక్త సహకారంతో నిర్వహించిన ఈ కార్యశాలలో సలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. బాధ్యతాయుతమైన, స్థిరమైన ఆహార భద్రత, పోషకాహారంలో ఆవిష్కరణ కోసం ప్రతిపాదనలను చర్చించి అభివృద్ధి చేయడం, ముఖ్యంగా చిరుధాన్యాలు, ఇతర వినియోగించని ఆహారాలపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. వాటి వినియోగానికి సంబంధించిన సవాళ్లన్ని చర్చించారు. తొలుత, ఫుడ్ సైన్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ కె.ఉమాదేవి, క్యాంపస్ లెఫ్ట్ డీన్ ప్రొఫెసర్ బాల్కుమార్: గురునాథ్ మార్తీ గీతమ్ లోని సెంటర్ ఫర్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ గురించి ఇతర వక్తలకు పరిచయం చేసి, దాని భవిష్య ప్రణాళికలను వివరించారు.

కోవెంట్రీ వర్సిటీకి చెందిన డాక్టర్ లోపాముద్ర పట్నాయక్ సక్సేనా, ప్రొఫెసర్ న్యూ చార్లెస్ వర్త్ , ఇండియన్ ఇన్స్టిట్యూట్ అఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ కి చెందిన డాక్టర్ పి.ఎం. మాలతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఆహారం, పోషకాహార విభాగానికి చెందిన ప్రొఫెసర్ టీ.ఎం. హిమవతి, ఒడిస్సా మిల్లెట్ మిషన్ కు . చెందిన దినేష్ బాలం, వాసన్ కు చెందిన జయప్రకాష్, రిచ్ నుంచి డాక్టర్ జోనాథన్ ఫిలాయ్, మిల్లెనోవా ఫుడ్స్. వ్యవస్థాపకురాలు సౌమ్య ముందారపు తదితరులు పోషకాహార సమస్యలను పరిష్కరించడానికి తమ పరిశోధన సహకారం అందించడంతో పాటు చిరుధాన్యాల సేద్యంపై వ్రాతావరణ మార్పుల ప్రభావాన్ని వివరించారు.ఈ కార్యశాలను డాక్టర్ జి.నిహారిక, డాక్టర్ శృతి పావగాడి, శ్వేత గండికోటి విజయవంతంగా నిర్వహించారు. ఆహారం, సాంకేతికత రంగంలో పరిశోధన, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి గీతం స్కూల్ ఆఫ్ సెన్స్ కట్టుబడి ఉందన్నారు.

 

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

9 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

9 hours ago