Hyderabad

మృతిచెందిన ఆర్టీసీ కార్మికుని కుటుంబాన్ని ఆదుకోవాలి – కాంగ్రెస్ పార్టీ

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

మియపూర్ ఆర్టిసి డిపోలో ఔట్ సోర్సింగ్ విభాగంలో హౌస్ కీపింగ్ గా పని చేస్తున్న మెదక్ జిల్లా, పాపన్నపేట్ గ్రాస్మానికి చెందిన కాశ సామయ్యా మంగళవారం రోజు గుండెపోటుతో మృతి చెందాడు..తోటి కార్మికులలు మియాపూర్. డివిజన్ కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు, ఇలియజ్ షరీఫ్ దృష్టికి తీసుకురావడం తో స్పందించిన ఆయన వెంటనే ఆర్టీసీ కార్మిక విభాగం అధ్యక్షుడు, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షుడు నడిమింటి కృష్ణ ను ఘటనా స్థలానికి పంపించారు. దీంతో తోటి కార్మికుల తో కల్సి ఆర్టీసీ డిపో మేంనేజర్ తో చర్చలు జరపగా అర్వత కలిగిన మృతుడి కుటుంబ సభ్యులకి తమ డిపోలోనే ఉద్యోగoకల్పిస్తామని డిపో మేనేజర్ హామీ ఇచ్చారని యూనియన్ నాయకులు తెలిపారు. తోటి కార్మికులతో పాటు మేనేజర్ కూడా ఆర్హిక సహకారం అందివ్వడానికి ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్యక్షుడు నల్లగండ్ల రమేష్ కుమార్, డి కార్తిక్ తదితరులు పాల్గొన్నారు.

Ramesh

Recent Posts

సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర మరింత పెరగాలి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి ,అమీన్పూర్ : సమాజ సేవలో స్వచ్ఛంద సంస్థల పాత్ర అభినందనీయమని రాబోయే రోజుల్లో వారి పాత్ర మరింత…

6 hours ago

మీ ఆలోచనే మీకు పెట్టుబడి

గీతంలో నిర్వహించిన ముఖాముఖిలో వజ్ర ఆటోమేషన్ పూర్వ సీఈవో వెల్లడి మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఒక మంచి ఆవిష్కరణ…

9 hours ago

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

2 days ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

2 days ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

3 days ago