మనవార్తలు , రామచంద్రపురం:
బి హెచ్ ఈఎల్ దేవాలయంలో ఘనంగా సుబ్రమణ్యస్వామి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా జరిగాయి. ప్రముఖ వేద పండితులు సుబ్రమణియమ్ తదితర తదితర వేద పండితుల సమక్షంలో బిహెచ్ఎల్ దేవాలయ యంత్రాంగం ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించింది. సుబ్రహ్మణ్య స్వామి జయంతి సందర్భంగా పాలాభిషేకంతో పాటు పంచామృతాలతో అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా అధిక సంఖ్యలో భక్తులు సుబ్రమణ్యం స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.