Telangana

పెన్నార్ పరిశ్రమ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బిఆర్టియుని బలపరచండి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

కార్మికుల సంక్షేమం, ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా పనిచేస్తున్న బి.ఆర్.టి.యు కార్మిక సంఘాన్ని బలపరిచి, మెరుగైన వేతన ఒప్పందాన్ని సాధించుకోవాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పెన్నార్ పరిశ్రమ కార్మికులకు పిలుపునిచ్చారు. ఈ నెల 6వ తేదీన పెన్నార్ పరిశ్రమంలో జరగనున్న కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడలో గల పెన్నార్ పరిశ్రమ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్లో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో కార్మికులు ఎంతో నమ్మకంతో బిఆర్టియూ నాయకత్వాన్ని బలపరిచారని, ఇందుకు అనుగుణంగా కార్మికులకు మెరుగైన వేతనం ఒప్పందం అందించడంతో పాటు వివిధ సౌకర్యాలు కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. గతంలో పనిచేసిన కార్మిక సంఘాలకు విభిన్నంగా పనిచేయడంతో పాటు ప్రతి కార్మికుడి సంక్షేమానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి గంట గుర్తుపై ఓటు వేసి బి ఆర్ టి యు ని గెలిపిస్తే అందరికీ ఆమోదయోగ్యమైన వేతన ఒప్పందం చేయించడంతోపాటు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందించడం, నిష్పక్షపాతంగా ప్రతి కార్మికుడికి సకాలంలో ప్రమోషన్లు అందించేలా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో బిఆర్టియు రాష్ట్ర అధ్యక్షులు, పెన్నార్ కార్మిక సంఘం అధ్యక్షులు రాంబాబు యాదవ్, బి ఆర్ టి యు రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బిఆర్ఎస్ పార్టీ పటాన్చెరు మండలం అధ్యక్షులు పాండు, కార్మిక సంఘం ప్రతినిధులు ఎన్ వి రావు, లక్ష్మారెడ్డి, సోమేశ్వర్, పెంటయ్య, వెంకటేశ్వర్లు, మహేష్, జానకిరామ్, రామ్ మోహన్ రావు, శ్రీ రామ్ సింగ్, బి వి రావు, భారీ సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago