Telangana

ప్రతిచోటా గణాంకాలు: ప్రొఫెసర్ జేఎస్ రావు

పటాన్‌చెరు,మనవార్తలు ప్రతినిధి :

ప్రస్తుత ప్రపంచంలో గణాంకాల ప్రాధాన్యం బాగా పెరిగిపోయిందని, ఏ రంగంలో చూసిన గణాంకాల ఆవశ్యకత తప్పనిసరిగా మారిందని అమెరికాలోని శాంటా బార్బరాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం స్టాటిస్టిక్స్, ఆఫ్లెడ్జ్ ప్రాబబిలిటీ విభాగ విశిష్ట ఆచార్యుడు ప్రొఫెసర్ జే.ఎస్.రావు అన్నారు. గీతం స్కూల్ ఆఫ్ సెన్స్డ్ లోని గణిత శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘గణాంకాలు కొన్ని విహారాలు’ అనే అంశంపై గురువారం ఆయన ఆతిథ్య ఉపన్యాసం చేశారు.నేటి సమాజంలో అనువర్తిత గణాంకాలు విస్తృతంగా ఉన్నాయని గణాంక రంగంలో నిపుణుడెన ప్రొఫెసర్ రావు చెప్పారు. ప్రపంచాన్ని మార్చే పరిణామాలను కనుగొని అమలు చేయడానికి గణాంక నిపుణులు తెర వెనుక నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. డేటా మెనింగ్, బిజినెస్ అనలిటిక్స్, యాక్చురియల్, ఫైన్టాన్షియల్ మోడల్స్, వచన-దృశ్య విశ్లేషణ (టెక్స్ట్-ఇమేజ్ అనాలిసిస్) వంటి వివిధ రంగాలకు గణాంకాల వినియోగం విస్తరించినట్టు. ఆయన తెలిపారు.

వాస్తవ ప్రపంచంలో గణాంకాల పాత్ర ఈ నిర్దిష్ట రంగాలకు మించినదని, ఇది విశ్వవ్యాప్తంగా ప్రభుత్వ కార్యకూపాలలో కీలక భూమిక పోషిస్తోందన్నారు. ముఖ్యంగా ప్రజా భద్రత, ఆరోగ్య సంరక్షణ మెరుగుదల, వివిధ విభాగాలలో జ్ఞాన పురోగతికి దోహదం చేస్తుందని చెప్పారు. ఏదైనా ముఖ్యమైన రంగంలో పరిశోధకులకు గణాంక మద్దతు ప్రాముఖ్యతను ప్రొఫెసర్ జేఎస్ రావు నొక్కిచెప్పారు.నేటి డేటా ఆధారిత ప్రపంచంలో, గణాంకాలను అన్వయించడమనేది సమాజంలోని ప్రతి అంశాన్ని స్పృ శించే నిత్య వాస్తవికతగా పేర్కొన్నారు. గణాంకాల రంగం శతాబ్దాలుగా ఉన్నప్పటికీ, ఆధునిక గణాంకవేత్తల వినూత్న పరిష్కార విధానాల కారణంగా ఇటీవలి సంవత్సరాలలో దాని ప్రభావం గణనీయంగా విస్తరించినట్టు డాక్టర్ రావు, చెప్పారు.కాగా, అతిథిని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ బీ.ఎం. నాయుడు స్వాగతించి, ఆయన నైపుణ్యాలను ‘పంచుకునేందుకు గీతం విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

13 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

14 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago