పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో నేడు సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని ఆలయం భక్తులతో కిటకిట లాడింది సిద్ధిగణపతి సింధూర వర్ణం లో భక్తులకు దర్శనమిచ్చిడు .ఉదయం నుండి విశేష పంచామృత అభిషేకము ,ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల సంకష్టహర చతుర్దశి పురస్కరించుకొని సిద్ధి గణపతి ఆరాధిస్తే కోరిన కోరికలు తీరుతాయని , సంకష్టహర చతుర్దశి రోజున గణనాధుని వ్రతం చేయడం వల్ల అన్ని విజయాలు కలుగుతాయని తెలిపారు . సిద్ది గణపతి స్వామివారి వ్రతం మరియు అన్నదాన కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో లావణ్య ,ఆలయ ధర్మకర్తలు కృష్ణవేణి ,జూనియర్ అసిస్టెంట్లు ఈశ్వర్,సోమేశ్వర్ ,ఆలయ అర్చకులు అజయ్ ,సంతోష్ శర్మ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి భక్తులు తదితరులు పాల్గొన్నారు.
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…