Telangana

గీతం స్కాలర్ ఆయేషాబేగంకు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని కె. ఆయేషా బేగంను డాక్టరేట్ వరించింది. ‘ఎల్ సీ-ఎంఎస్ / ఎంఎస్ ద్వారా జీవమాత్రికలలో ఎంపిక చేసిన ఔషధాల జీవవిశ్లేషన పద్ధతి అభివృ ద్ధి, ధ్రువీకరణ, ఫార్మకోకెనైటిక్ అధ్యయనంలో దాని పనితనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ గుర్తింపును ఉపయోగించి మానవ ప్లాస్మాలోని ఫెద్రాటినిబ్, పెక్సి డుర్ట్ నిబ్ , ఉపాదాసిటివిబ్ అనే ఎంపిక చేసిన ఔషధాల కోసం ప్రస్తుత పరిశోధన లక్షించినట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన, ధృవీకరించిన పద్ధతుల నుంచి పొందిన ఫలితాలు అధిక స్థాయి సున్నితత్వం, నిర్దిష్టత, ఎంపిక, పునరుత్పత్తి, చాలా వేగవంతమైన తొలగింపు, కోలుకోవడం వంటివి గత పద్ధతులతో పోల్చినప్పుడు తక్కువ ప్రభావంతో స్థిరత్వాన్ని చూసాయన్నారు. ఈ నూతన విస్తృత అధ్యయనం మానన ప్లాస్మాలో ఎంపిక చేసిన ఔషధాల కోసం వినూత్న పద్ధతిని రూపొందించినట్టు తెలియజేశారు. అయేషా బేగం సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం. విశ్వవిద్యాలయం, హై దరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్, విశాఖపట్నం ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రాజా, పలు విభాగాలు: అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago