Telangana

గీతం స్కాలర్ ఆయేషాబేగంకు పీహెచ్ డీ

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని ఫార్మసీ విభాగం పరిశోధక విద్యార్థిని కె. ఆయేషా బేగంను డాక్టరేట్ వరించింది. ‘ఎల్ సీ-ఎంఎస్ / ఎంఎస్ ద్వారా జీవమాత్రికలలో ఎంపిక చేసిన ఔషధాల జీవవిశ్లేషన పద్ధతి అభివృ ద్ధి, ధ్రువీకరణ, ఫార్మకోకెనైటిక్ అధ్యయనంలో దాని పనితనం’పై ఆమె అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.శివకుమార్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎల్సీ-ఎంఎస్/ఎంఎస్ గుర్తింపును ఉపయోగించి మానవ ప్లాస్మాలోని ఫెద్రాటినిబ్, పెక్సి డుర్ట్ నిబ్ , ఉపాదాసిటివిబ్ అనే ఎంపిక చేసిన ఔషధాల కోసం ప్రస్తుత పరిశోధన లక్షించినట్టు తెలిపారు. అభివృద్ధి చెందిన, ధృవీకరించిన పద్ధతుల నుంచి పొందిన ఫలితాలు అధిక స్థాయి సున్నితత్వం, నిర్దిష్టత, ఎంపిక, పునరుత్పత్తి, చాలా వేగవంతమైన తొలగింపు, కోలుకోవడం వంటివి గత పద్ధతులతో పోల్చినప్పుడు తక్కువ ప్రభావంతో స్థిరత్వాన్ని చూసాయన్నారు. ఈ నూతన విస్తృత అధ్యయనం మానన ప్లాస్మాలో ఎంపిక చేసిన ఔషధాల కోసం వినూత్న పద్ధతిని రూపొందించినట్టు తెలియజేశారు. అయేషా బేగం సమర్పించిన సిద్ధాంత వ్యాసం పీహెచ్ డీ పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం. విశ్వవిద్యాలయం, హై దరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఫార్మసీ డీన్ ప్రొఫెసర్ జగత్తరణ్ దాస్, విశాఖపట్నం ఫార్మసీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్. రాజా, పలు విభాగాలు: అధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది పలువురు అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago