మనవార్తలు ,పటాన్ చెరు:
ఇప్పటికే 13 గిన్నిస్ , 15 అసిస్ట్ , నాలుగు యూనిక్ వరల్డ్ రికార్డులు సాధించి , అదే ఓ రికార్డుగా వినుతికెక్కిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్ పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ తాజాగా మరో ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించింది . ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ , అనిల్ శ్రీవాస్తవలతో కలిసి హ్యాండ్మేడ్ పేపర్తో రూపొందించిన 2,111 క్విల్లింగ్ డాల్స్ , 1,111 ఆభరణాలతో పాటు ఆరెగామీ పేపర్తో రూపొందించిన 9,200 చేపలు , 1,145 మేష్లీ ఆకులు , 2,300 నిమ్మతొనలు , 3,501 వేల్స్ లు ఒకచోట ఉంచగా , దానిని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా గుర్తించి , యూనిక్ వరల్డ్ రికార్స్ వారు ఆమేరకు ధ్రువీకరణ పత్రాలను పంపారు . తాజాగా ఆరు యూనిక్ వరల్డ్ రికార్డులను సాధించిన శివాలీ , ఆమె తల్లిదండ్రులను గీతం అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్.శివప్రసాద్ , రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , పలువురు అధ్యాపకులు , విద్యార్థులు అభినందించారు .
పటాన్చెరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవం పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం…
ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపిక పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయి…
గీతంలో ప్రారంభమైన మూడు రోజుల కార్యక్రమం తమ నైపుణ్యాలను పంచుకుంటున్న జాదవ్ పూర్ వర్సిటీ, ఐఐటీ ఢిల్లీ అధ్యాపకులు పటాన్చెరు…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతీయ సాంకేతిక సంస్థ (ఐఐటీ) బాంబే సహకారంతో హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆసియాలోనే…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : ఐదు సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించు కోవాలని…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : దేశ వ్యాప్త పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఆదివారం పటాన్చెరు పట్టణంలోని జిహెచ్ఎంసి కార్యాలయం…