మనవార్తలు , శేరిలింగంపల్లి :
భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిలు చింతకింది గోవర్ధన్ గౌడ్, వై శ్రీధర్ లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాంతి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి అర్బన్ జిల్లా పరిధిలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జిల్లా మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, ఉపాధ్యక్షులు తోపుగొండ మహిపాల్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…