మనవార్తలు , శేరిలింగంపల్లి :
భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధికార ప్రతినిధిగా శేరిలింగంపల్లి డివిజన్ తారా నగర్ ప్రాంతానికి చెందిన సింగారెడ్డి శాంతి భూషణ్ రెడ్డి నియమితులయ్యారు. ఆయన గతంలో శేరిలింగంపల్లి మండల కార్యవర్గ సభ్యునిగా, శేరిలింగంపల్లి 106 డివిజన్ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. గత రెండు దశాబ్దాలుగా పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న శాంతి భూషణ్ రెడ్డిని అధికార ప్రతినిధిగా నియమిస్తూ జిల్లా ఇంచార్జ్ ఎండేల లక్ష్మీనారాయణ, అధ్యక్షుడు సామ రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిలు చింతకింది గోవర్ధన్ గౌడ్, వై శ్రీధర్ లు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాంతి భూషణ్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి అర్బన్ జిల్లా పరిధిలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, జిల్లా మాజీ వైస్ చైర్మన్ నందకుమార్ యాదవ్, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సామ రంగారెడ్డి, చింతకింది గోవర్ధన్ గౌడ్, ఉపాధ్యక్షులు తోపుగొండ మహిపాల్ రెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి విన్నవించిన పాటి గ్రామస్తులు మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ముత్తంగి డివిజన్ పాటి గ్రామ…
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…