పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
రామచంద్రపురం పట్టణ బిజెపి కార్యాలయంలో బిజెపి కార్యవర్గ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం పట్టణ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శిగా బలరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్ నియామక పత్రాన్ని బలరాంకు అందజేశారు. అనంతరం బలరాం మాట్లాడుతూ బిజెపి పార్టీ కి అందించిన సేవలను, సమాజానికి చేసిన సేవలను గుర్తించి తనను నియమించిన జిల్లా పార్టీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షులు నర్సింగ్ గౌడ్”కి బిజెపి కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.నా పైన నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యతను అప్పగించినందుకు రామచంద్రాపురం పట్టణంలో బిజెపి పార్టీని పటిష్ట పరిచేందుకు పార్టీ నియమాలకు లోబడి నా యొక్క శాయి శక్తులు ఉపయోగించి క్రియాశీలక పాత్ర పోషిస్తా అని తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎలక్షన్స్ లో గోల్కొండ కోట మీద బిజెపి జెండా రెపరెప లాడుతుందని అన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో బిజెపి గెలుపు లక్ష్యం గా ముందుకు వెళ్తానని తెలిపారు
జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…
మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్తో మన…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…
పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…
- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…
వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…