520 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత…
– స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సివిల్ సప్లై గోదాం కు తరలింపు
– ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద పట్టివేత
– 6 ఏ కింద కేసు నమోదు
పటాన్ చెరు:
హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో పోగుచేసి పొరుగు రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్, పోలీసులు సంయుక్త ఆధ్వర్యంలో ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద తనిఖీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. సివిల్ సప్లై అధికారి సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం… హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో సమకూర్చిన సుమారు 520 క్వింటాళ్ల రేషన్ బియ్యంను రెండు వేరు వేరు లారీలలో బుధవారం తెల్లవారుజామున ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని మండలంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు తనిఖీలు సివిల్ సప్లై, ఎన్ ఫోర్స్ మెంట్. పోలీసులు తనిఖీలు చేపట్టారు. రెండు గంటల వ్యవధిలో రెండు లారీల్లో తరలిస్తున్న అక్రమ బియ్యంను పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకుని స్వాధీనం చేసుకున్న 520 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టణంలోని సివిల్ సప్లై గోదాంకు తరలించారు. సివిల్ సప్లై యాక్ట్ 6 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ సత్యనారాయణ, సివిల్ సప్లై అధికారి షఫీ ఉద్దీన్, శ్రీనివాస్, ఆర్ఐ రంగయ్య, వీఆర్ఏ సిబ్బంది పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…