Telangana

సర్పంచ్ బొడ్డు జగన్ తో సహా భారీ సంఖ్యలో బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు

_పోచారంలో కాంగ్రెస్ ఖాళీ..

_అభివృద్ధి మా అజెండా.. సంక్షేమమే మా ధ్యేయం

_ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు, మనవార్తలు ప్రతినిధి :

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పటాన్చెరు నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాల మూలంగా ప్రతిపక్ష పార్టీల నాయకులు బి ఆర్ ఎస్ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని, రానున్న రోజుల్లో బిఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారబోతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్చెరు మండలం పోచారం గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొడ్డు జగన్, వార్డు సభ్యులు విజయ, నర్సమ్మ, యాదగిరి, లక్ష్మి, సుమారు 300 మంది అనుచరులతో కలిసి ఆదివారం సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి జెండా సంక్షేమమే లక్ష్యంగా నియోజకవర్గంలో కార్యక్రమా చేపడుతున్నామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్తున్నామని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పే కల్లబొల్లి మాటలను ప్రజలు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. పటాన్చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగిందని అన్నారు. అతి త్వరలో నియోజకవర్గంలోని ప్రతిపక్ష పార్టీల సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాండు, మాజీ ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు దశరథ రెడ్డి, కోడూరి బిక్షపతి, తలారి బిక్షపతి, ఉప సర్పంచ్ రాజు, ఆంజనేయులు, యాదయ్య, కిష్టయ్య, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

admin

Recent Posts

పటాన్‌చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన తెలంగాణ యువజన సంఘాల సమితి యువజన వికాస సమితి అధ్యక్షులు

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : పటాన్‌చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…

2 hours ago

అయ్యమ్మ చెరువు పరిస్థితిపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం

అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…

3 hours ago

సీఎస్ఈలో ఫాతిమాకు పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…

24 hours ago

ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం ఎమ్మెల్యే జిఎంఆర్

శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మానవసేవయే మాధవసేవ…

1 day ago

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

2 days ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

2 days ago