మనవార్తలు ప్రతినిధి,మియాపూర్ :
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం ధైర్యానికి ప్రతీక,సమానత్వానికి చిహ్నం,ప్రజల కోసం పోరాడిన గొప్ప స్ఫూర్తి అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి జగదీశ్వర్ గౌడ్ అన్నారు శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్జ యంతి సందర్భంగా మియాపూర్ డివిజన్ పరిధిలోని ఆల్విన్ చౌరస్తా శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శేరిలింగంపల్లి నియోజకవర్గం నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఆ మహానీయుడికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం మాట్లాడుతూ తెలంగాణ తొలి రాజు,బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు,మొగులాయి దౌర్జన్యాలను ఎదిరించి,తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు పాపన్న గౌడ్ జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది .పదవి కోసం కాదు ప్రజల కోసం పోరాడాలి ” మనం అందరం సంకల్పం చేద్దాం ప్రజల అభివృద్ధి కోసం,సమానత్వం కోసం,న్యాయం కోసం నిరంతరం కృషి చేద్దాం సామాన్య కుటుంబంలో జన్మించిన ఒక వ్యక్తి, అన్యాయానికి ఎదురు నిలబడి రాజ్యాన్ని నిర్మించడం అంటే అది సాధారణ విషయం కాదు.అది ధైర్యం,ఆత్మవిశ్వాసం,ప్రజల పట్ల ఉన్న అంకితభావానికి ప్రతీక శ్రీ పాపన్న గౌడ్ అదే చేసి చూపించారని,ఆయన పోరాటం కేవలం అధికారానికి కాదు అది సమానత్వానికి,న్యాయానికి,స్వాభిమానానికి చేసిన పోరాటం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్,శేరిలింగంపల్లి నియోజకవర్గం గౌడ్ సంఘం అధ్యక్షులు లక్ష్మీనారాయణ గౌడ్,టిపిసిసి రాష్ట్ర లేబర్ సెల్ ఉపాధ్యక్షులు నల్ల సంజీవ రెడ్డి,నాయకులు బల్లింగ్ యాదగిరి గౌడ్,రమణ మూర్తి,సయ్యద్ గౌస్,వీరేందర్ గౌడ్,ఓం ప్రకాష్ గౌడ్,సత్యం గౌడ్,కనకమామిడి నరేందర్ గౌడ్,యాదగిరి గౌడ్,మాజీ కౌన్సిలర్ మోహన్ గౌడ్,బాలింగ్ గౌతమ్ గౌడ్,కరుణాకర్ గౌడ్,మన్నేపల్లి సాంబశివరావు,కావూరి ప్రసాద్,రవీందర్ రెడ్డి,శేఖర్ ముదిరాజ్,పుట్ట వినయ్ కుమార్ గౌడ్,ప్రవీణ్ గౌడ్,కృష్ణ గౌడ్,బాబు గౌడ్,సాయి కృష్ణ గౌడ్,ఏకాంత గౌడ్,వెంకటేష్ గౌడ్,ఎంఎస్ రాజు,నాగేశ్వర రావు,బాలకృష్ణ,గంగాల గణేష్ యాదవ్,తాండ్ర రామచందర్,రాములు గౌడ్,నర్సింహ గౌడ్,రాము,
ఆనంద్ గౌడ్,సత్యనారాయణ,శేరిలింగంపల్లి నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు నర్సింగ్ రావు,ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ గుప్తా,శంకర్ గౌడ్,కృష్ణ,వెంకటేష్ గౌడ్,లక్ష్మీనారాయణ, సత్య రెడ్డి,శంకర్,సుధాకర్,భాస్కర్ గౌడ్,వెంకటేష్,తిరుపతి,ముక్తార్,సాజిద్,విష్ణు,సత్యనారాయణ,శ్రీనివాస్ గుప్తా,రవి కుమార్ గౌడ్,మహిళా కాంగ్రెస్ డిసిసి కార్యదర్శి శిరీష సత్తూరు,బ్లక్ అధ్యక్షురాలు శ్రీమతి భాగ్యలక్ష్మి,నాయకులు శ్రీమతి కల్పన ఏకాంత్ గౌడ్,శ్రీమతి అనిత,శ్రీమతి శేషిరేఖ,శ్రీమతి శ్రీజ రెడ్డి,ఉపాధ్యక్షులు శ్రీమతి జయ,శ్రీమతి పార్వతి,నాజియా తదితరులు పాల్గొన్నారు.
