శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
:తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ చిహ్నంగా నిలుస్తుందని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గంగిరెద్దులతో డు బసవన్నలు ఆడిస్తూ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కొత్త సంవత్సరం తొలి నెలలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులు పండగ ప్రాముఖ్యతను వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శించారు. ముఖ్యంగా తెలుగువారి లోగిళ్ళ ముందు అందమైన రంగవల్లులతో అలంకరిస్తారు. అలా పిల్లలను చిన్నప్పటినుండి మన తెలుగు పండుగల గురించి, వాటి ఔన్నత్యాన్ని తెలియజేయడం మన బాధ్యత అని ఉమామహేశ్వరి అన్నారు. ముందు ముందు కూడా పెరుగుతున్న పాశ్చాత ధోరణికి అనుగుణంగా తెలుగు పండుగలను కూడా జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన యేపురి శివానందంని…
అయ్యమ్మ చెరువు కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చెరువుల్లోకి కాలుష్య జలాలు వదిలితే భరతం పడతాం ప్రజల ప్రాణాలు పోతుంటే…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధక విద్యార్థి…
శ్రీ భగవాన్ సత్యసాయి సేవాసమితి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మానవసేవయే మాధవసేవ…
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…