శేరిలింగంపల్లి, మనవార్తలు ప్రతినిధి :
:తెలుగువారి సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ చిహ్నంగా నిలుస్తుందని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రిన్సిపల్ ఉమామహేశ్వరి అన్నారు. గురువారం రోజు బీహెచ్ఈఎల్ టౌన్ షిప్ లోని జ్యోతి విద్యాలయ హై స్కూల్ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి రంగురంగుల ముగ్గులు వేసి గంగిరెద్దులతో డు బసవన్నలు ఆడిస్తూ పండుగ గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కొత్త సంవత్సరం తొలి నెలలో వచ్చే మొదటి పండగ సంక్రాంతి కావడంతో దీనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది, ఆ ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరిస్తూ విద్యార్థులు పండగ ప్రాముఖ్యతను వివిధ కళారూపాల ద్వారా ప్రదర్శించారు. ముఖ్యంగా తెలుగువారి లోగిళ్ళ ముందు అందమైన రంగవల్లులతో అలంకరిస్తారు. అలా పిల్లలను చిన్నప్పటినుండి మన తెలుగు పండుగల గురించి, వాటి ఔన్నత్యాన్ని తెలియజేయడం మన బాధ్యత అని ఉమామహేశ్వరి అన్నారు. ముందు ముందు కూడా పెరుగుతున్న పాశ్చాత ధోరణికి అనుగుణంగా తెలుగు పండుగలను కూడా జరుపుకోవాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.
అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నాలుగు డివిజన్లు ఏర్పాటు చేయాల్సిందే డివిజన్ల ఏర్పాటులో శాస్త్రీయత లోపించింది. సంక్రాంతి తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజాభీష్ఠం మేరకు కిష్టారెడ్డిపేట డివిజన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర…
చిట్కుల్ లో ఓబన్న చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులు అర్పించిన నీలం.. మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ప్రజల…
రుద్రారం మల్లన్న స్వామి జాతరలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: మల్లన్న స్వామి ఆశీస్సులు…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో శ్రామిక సంక్షేమ కేంద్రం కో - ఆర్డినేటర్…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…