మనవార్తలు , శేరిలింగంపల్లి :
ప్రపంచ మానవ హక్కుల సంఘం తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ రెడ్డి సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల సంఘం రెండో వార్షికోత్సవ వేడుకలు మియపూర్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ చైర్మన్ మొరం రెడ్డి సుబ్బారెడ్డి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ దినేష్ కుమార్, సీఈవో సురేష్ రెడ్డి లు పాల్గొని కేక్ కట్ చేసి సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ చైర్మన్ తౌట్ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో కమిటీలు వేసి ప్రజలకు దగ్గరైన సంస్థ ఏదైనా ఉంది అంటే అది ప్రపంచ మానవ హక్కుల సంఘం అని గర్వంగా తెలియజేస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి సమస్య ఉన్నా ముందుండి ఎదుర్కొంటూ అనేకమందికి న్యాయం జరిగే విధంగా గా సంస్థలోని సభ్యులందరూ ఐకమత్యంగా పనిచేస్తూ ముందున్నారని కొనియాడారు. ముందు ముందు భవిష్యత్తులో ప్రపంచ మానవ హక్కుల సంఘం నుండి అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం వివిధ పదవులు పొందిన వారికి నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జిల్లాల నుండి చైర్మన్లు, వైస్ చైర్మన్లు, చైర్పర్సన్లు పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…