మనవార్తలు , పటాన్ చెరు:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు .
గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని కవయిత్రి బహినాబాయి చౌధరి ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో అరుణ్ పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పూనెలోని ప్రాంతీయ ఎన్ఎస్ఎస్ డెరైక్టరేట్ ఈ ముందస్తు శిబిరాన్ని నిర్వహించింది . అరుణ్ దినకరన్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడలతో పాటు ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు .
ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గణతంత్ర దినోత్సవ కవాతుకు గీతం విద్యార్థి ఎంపిక కావడం పట్ల రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తదితరులు హర్షం వెలిబుచ్చి , అరుణ్ను అభినందించారు .
మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…
ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…
భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు : ప్రస్తుత పోటీ…
భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…
సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల సిఎస్ఆర్ నిధులు స్థానిక…