మనవార్తలు , పటాన్ చెరు:
గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 జనవరి 26 న దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించే కవాతులో పాల్గొనడానికి గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం , హైదరాబాద్లోని జాతీయ సేవా పథకం ( ఎన్ఎస్ఎస్ ) వాలంటీర్ , బీఎస్సీ మూడో ఏడాది విద్యార్థి ఎం.అరుణ్ దినకరన్ ఎంపికయ్యారు . ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలో జనవరి 1 నుంచి 31 వరకు జరిగే నెల రోజుల శిక్షణలో ఈ విద్యార్థి పాల్గొననున్నారు .
గణతంత్ర దినోత్సవానికి సన్నాహకంగా జల్గావ్లోని కవయిత్రి బహినాబాయి చౌధరి ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయంలో అక్టోబర్ 12 నుంచి 21 వరకు నిర్వహించిన ఎన్ఎస్ఎస్ శిబిరంలో అరుణ్ పాల్గొని విజయవంతంగా పూర్తిచేశారు . కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు , క్రీడల మంత్రిత్వ శాఖ పర్యవేక్షణలో పూనెలోని ప్రాంతీయ ఎన్ఎస్ఎస్ డెరైక్టరేట్ ఈ ముందస్తు శిబిరాన్ని నిర్వహించింది . అరుణ్ దినకరన్ గతంలో అంతర్ జిల్లా హాకీ పోటీలలో నాలుగు ప్రతిభా మెడలతో పాటు ఫుట్బాల్ టోర్నమెంట్ బెస్ట్ గోల్ కీపర్ పురస్కారాన్ని కూడా పొందారు .
ప్రస్తుతం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయ ఫుట్బాల్ టీమ్ సభ్యుడిగా కూడా సేవలందిస్తున్నారు . విద్యార్థులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గణతంత్ర దినోత్సవ కవాతుకు గీతం విద్యార్థి ఎంపిక కావడం పట్ల రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ , స్కూల్ ఆఫ్ సెన్ట్స్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జీఏ రామారావు , ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ పీవీ నాగేంద్ర కుమార్ తదితరులు హర్షం వెలిబుచ్చి , అరుణ్ను అభినందించారు .
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…