Telangana

గణితంలో ఆర్.సుహాసినికి పీహెచ్.డీ.

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: 

గణితంలో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పీహెచ్.డీ)ని విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్ ఆర్. సుహాసినిని హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం అభినందించింది. ‘నానోపార్టికల్స్ తో కూడిన సాగే షీటుపై మాగ్నెటోహైడ్రోడైనమిక్ (ఎంహెచ్ డీ) మైక్రోపోలార్ ద్రవ ప్రవాహంపై ఒక సంఖ్యా అధ్యయనం’ అనే శీర్షికతో ఆమె పరిశోధన చేసినట్టు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. ఇది న్యూటోనియన్ కాని ద్రవ గతిశాస్త్రం, వేడి, ద్రవ్యరాశి బదిలీ దృగ్విషయాల అధ్యయనానికి గణనీయమైన తోడ్పాటును అందిస్తుందన్నారు.ఈ పరిశోధన గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, గణిత శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్, పరిశోధన పర్యవేక్షకుడు డాక్టర్ ఆర్. శ్రీనివాస రాజు మార్గదర్శనంలో నిర్వహించినట్టు తెలియజేశారు. ఈ అధ్యయనం మాగ్నెటో-మైక్రోపోలార్ నానోఫ్లూయిడ్ ప్రవాహంపై వివిధ భౌతిక పారామితుల ప్రభావాలను విశ్లేషించడానికి అధునాతన సంఖ్యా పద్ధతులను ఉపయోగించిందని, ధృవీకరించిన ఫలితాలు ఇప్పటికే అందుబాటులో ఉన్న సాహిత్యంతో దగ్గరగా ఉన్నాయన్నారు.డాక్టర్ సుహాసిని విజయవంతంగా డాక్టరేట్ డిగ్రీకి అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, ఇతర అధ్యాపకులు తదితరులు ఆమెను హృదయపూర్వకంగా అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

8 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

8 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

8 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

8 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

8 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

8 hours ago