Telangana

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులు

– ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావు

-సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జే మల్లికార్జున్ కు ఏషియన్ పెయింట్స్ కార్మికులు విరాళాలు అందజేత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులని ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని సిపిఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జే మల్లికార్జున్ అన్నారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక భవన్ లో సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏషియన్ పెయింట్ కార్మికులు విరాళాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ దేశంలో ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని ఆయన అన్నారు, ఎర్రజెండా ఉండడం వల్లనే చట్టసభలలో ప్రజా సమస్యలపై నిలదీయడం జరుగుతుందని, పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎర్రజెండ లేకపోతే దేశంలో ప్రజల తరఫున, పేదల తరఫున ప్రశ్నించే వాళ్ళే ఉండరని ఆయన అన్నారు, ప్రజలకు సంబంధించింది ఏ ఒక్క సమస్యను కూడా అడిగేవాళ్లు ఉండరని, అందుకే ఎర్రజెండా బలపడాలని, కమ్యూనిస్టులు ఉండాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు లేని దేశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలని ఆయన గుర్తు చేశారు, కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట, అధికారం ఉన్నచోట ఆయా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ప్రజా పోరాటాలు ఉదృతంగా కొనసాగుతున్నయని తెలిపారు. వచ్చే నెల 25 నుండి 28 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విరాళాలు అందజేసిన ఏషియన్ పెయింట్స్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య,ఏషియన్ పెయింట్ కార్మిక నాయకులు మనీ రాజు,బిఎస్ రెడ్డి,రాజా, ముత్యాలయ్య,గట్టయ్య,జనార్ధన్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

వందేమాతరం సామూహిక గీతాలాపన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…

2 days ago

ఇష్టా విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా ఐఐటి రామయ్య జన్మదిన వేడుకలు

చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…

2 days ago

గీతంలో ఉల్లాసంగా కేక్ మిక్సింగ్ వేడుక

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…

2 days ago

తాగునీటి పంపిణీలో ఇబ్బందులు తలెత్తితే ఉద్యమాలకు సిద్ధం

రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…

1 week ago

కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తున్న బిస్లరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…

1 week ago

శాండ్విక్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెమినార్

నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…

1 week ago