Telangana

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులు

– ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావు

-సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జే మల్లికార్జున్ కు ఏషియన్ పెయింట్స్ కార్మికులు విరాళాలు అందజేత

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

ప్రశ్నించే గొంతుక కమ్యూనిస్టులని ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని సిపిఎం రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జే మల్లికార్జున్ అన్నారు. బుధవారం పటాన్ చెరు పట్టణంలోని శ్రామిక భవన్ లో సిపిఎం రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏషియన్ పెయింట్ కార్మికులు విరాళాలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ దేశంలో ఎర్రజెండా లేకపోతే ప్రజా సమస్యలు చర్చకే రావని ఆయన అన్నారు, ఎర్రజెండా ఉండడం వల్లనే చట్టసభలలో ప్రజా సమస్యలపై నిలదీయడం జరుగుతుందని, పోరాటం చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఎర్రజెండ లేకపోతే దేశంలో ప్రజల తరఫున, పేదల తరఫున ప్రశ్నించే వాళ్ళే ఉండరని ఆయన అన్నారు, ప్రజలకు సంబంధించింది ఏ ఒక్క సమస్యను కూడా అడిగేవాళ్లు ఉండరని, అందుకే ఎర్రజెండా బలపడాలని, కమ్యూనిస్టులు ఉండాలని ఆయన అన్నారు. కమ్యూనిస్టులు లేని దేశాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడాలని ఆయన గుర్తు చేశారు, కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట, అధికారం ఉన్నచోట ఆయా దేశాలు అభివృద్ధి చెందుతున్నాయని, ప్రజల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయన్నారు. కమ్యూనిస్టులు బలంగా ఉన్నచోట ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని, ప్రజా పోరాటాలు ఉదృతంగా కొనసాగుతున్నయని తెలిపారు. వచ్చే నెల 25 నుండి 28 వరకు జరిగే రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విరాళాలు అందజేసిన ఏషియన్ పెయింట్స్ కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే రాజయ్య,ఏషియన్ పెయింట్ కార్మిక నాయకులు మనీ రాజు,బిఎస్ రెడ్డి,రాజా, ముత్యాలయ్య,గట్టయ్య,జనార్ధన్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

admin

Recent Posts

సమాజానికే సందేశం గాంధీజీ జీవన విధానం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జిన్నారంలో మహాత్మా గాంధీ విగ్రహావిష్కరణ సొంత నిధులతో గాంధీ విగ్రహం ఏర్పాటు జిన్నారం ,మనవార్తలు ప్రతినిధి : సమాజానికి ఒక గొప్ప…

7 days ago

మాతృభూమిపై మమకారాన్ని చాటే అపూర్వ అవకాశం వికసిత్ భారత్ రన్‌

మనవార్తలు ప్రతినిధి : భారతీయులంతా కలిసి అడుగేసే తరుణమిది జన్మభూమిపై మమకారాన్ని చూపెట్టే అవకాశమిది. వికసిత భారత్ రన్‌తో మన…

2 weeks ago

కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలు కొనసాగిస్తాం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను…

2 weeks ago

గొప్ప గాంధేయవాది కొండా లక్ష్మణ్ బాపూజీ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి : తొలి మలి దశ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన గొప్ప గాంధేయవాది కొండా…

3 weeks ago

పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేవి సైన్స్ ఎగ్జిబిషన్ లు

- జీవన విధానంలో ఆధునిక, సాంకేతిక పద్ధతులు వినియోగం పై చక్కటి ప్రదర్శనలు మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి :…

3 weeks ago

వికలాంగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి

వికలాంగుల పెన్షన్ 6వేలకు పెంచాలి మహిళా విభాగం రాష్ట్ర కమిటీ సభ్యురాలు మేరీ, డివిజన్ అధ్యక్షురాలు విజయలక్ష్మి పెన్షన్, ఇతర…

3 weeks ago