Hyderabad

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలి – రంగారెడ్డి సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత

మనవార్తలు ,శేరిలింగంపల్లి :

మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు శేరిలింగంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎంఈఓ కార్యాలయం ముందు సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా సిఐటియు శ్రామిక మహిళ కార్యదర్శి కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్ద పీట వేస్తున్నామని చెబుతూ పేపర్లో ప్రకటనలకే పరిమితమవుతుంది. మధ్యాహ్న భోజనం వండుతున్న కార్మికులకు గత సెప్టెంబర్ నుండి బిల్లులు మంజూరు కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులే తమ సొంత డబ్బులతో విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారని ప్రభుత్వం ఇప్పటిదాకా నిధులను మంజూరు చేయకపోవడంపై ఆమె ఆగ్రాన్ని వ్యక్తం చేశారు.

గతంలో నాలుగు రూపాయలు ఉన్న గుడ్డు ధర నేడు ఐదు నుండి ఆరు రూపాయలు ఉందని ఇప్పటివరకు గుడ్డు రేటు విషయంలో ప్రభుత్వం పెంచిన జీవనం అమలు చేయడం లేదని అందుకు అనుగుణంగా ఎక్కడ నిధులు ఇవ్వడం లేదని తెలిపారు. చివరికి పిల్లలకు ఇచ్చే బియ్యం సైతం నాసిరకంగా ఉంటున్నాయని వీటివల్ల పిల్లల తల్లిదండ్రులు కార్మికులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారని ఆమె గుర్తు చేశారు. వీటన్నిటిపై వెంటనే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి మండల కార్యదర్శి కొంగర కృష్ణ ముదిరాజ్, సువర్ణ, రాములు, షేక్ నస్రిన్, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago