నీటి సమస్య తీర్చడానికి ప్రణాళికలు…
శేరిలింగంపల్లి :
మియాపూర్ డివిజన్ లోని మక్తలో ఎస్సి బస్తీలో ఉన్న నీటి సమస్య గురించి అధికారులు దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే.మియాపూర్ బిజెపి డివిజన్ నాయకులు మక్త విలేజ్ లోని నీటి సమస్య గురించి అధికారులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే స్పందించిన అధికారులు స్థానికంగా ఉన్న సమస్యలపై అధ్యయనం చేయడానికి, బస్తీలో పైప్ లైన్ వేయడానికి గల మార్గం, కనెక్షన్ పాయింట్స్ ని చూసుకోవడం జరిగిందని బీజేపీ స్థానిక బీజేపీ నేతలు తెలిపారు. నీటి సమస్య తీవ్రతను అర్థం చేసుకుని వెంటనే స్పందించిన అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. బిజెపి నాయకులు అక్కడే ఉండి ప్రజలు పడే ఇబ్బందులు వివరించారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ మేనేజర్ సాయి చరిత, వర్క్ ఇన్స్పెక్టర్ జాజిరావ్ రమేష్, డివిజన్ అధ్యక్షుడు మానిక్ రావు, జనరల్ సెక్రటరీలు ఆకుల లక్ష్మణ్ ముదిరాజ్, రామకృష్ణ , గుండె గణేష్ ముదిరాజ్, గంగారం మల్లేష్, రమేష్, విజేందర్, అశోక్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : డిసెంబర్ 1వ తేదీన పటాన్ చెరు పట్టణంలో నిర్వహించ తలపెట్టిన వందేమాతరం 150…
చుక్కా రామయ్య ఆశయాల కనుగుణంగా ఇష్టా విద్యాసంస్థలు ఇష్టా విద్యాసంస్థల చైర్మన్ కార్తీక్ కోట మానసిక ఒత్తిడి లేని విద్యను…
పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం గురువారం ఉత్సాహభరితమైన, ఆనందకరమైన కేక్ మిక్సింగ్ వేడుకతో…
రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్న పంపిణీలో జాప్యం ఎందుకు అధికారులపై ఎమ్మెల్యే తీవ్ర అసహనం ప్రజల దాహార్తి తీర్చిన…
పాశమైలారం పారిశ్రామిక క్లస్టర్ (సిఐటియు) కన్వీనర్ అతిమేల మాణిక్ తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి కండ్లకు నల్ల రిబ్బను…
నూతన లేబర్ పాలసీ శ్రమశక్తి నీతి-2025 రాజ్యాంగ విరుద్ధం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు పటాన్ చెరు ,మనవార్తలు…