Telangana

పెన్షనర్లకు కనీస వేతనం 9వేలు ఇవ్వాలి_ పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి

భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం ముందు

పెన్షనర్ల సంఘం ఆధ్వర్యంలో ధర్నా, వినతి పత్రం అందజేత

మనవార్తలు ప్రతినిధి – పటాన్ చెరు

పెన్షనర్లకు కనీస వేతనం తొమ్మిది వేలు ఇవ్వాలని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నారాయణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అల్ ఇండియా యునైటెడ్ యాక్షన్ కమిటీ అఫ్ ఈపి ఎఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ ( ఏఐయు ఏసిఈపిఎ)కమిటీ మరియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పోరాట ఎజెండా లో భాగంగా, టిఏపీ ఆర్ పిఎ జిల్లా కమిటీ మూడు రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు జిల్లా కమిటీ సభ్యులతో పాటు ఈపిఎఫ్ పెన్షనర్స్ ఆధ్వర్యంలో మంగళవారం పటాన్ చెరు పట్టణంలోని భవిష్య నిధి ప్రాంతీయ కార్యాలయం ముందు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నా నిర్వహించారు అనంతరం భవిష్యనిది ప్రాంతీయ కార్యాలయం ఉప కమిషనర్ సురేంద్ర రావు కు వినతిపత్రం అందజేశారు. అనంతరం పెన్షనర్స్ ఉద్దేసించి రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ లక్షలాది ఈపీఎఫ్ పెన్షనర్లకు గౌరవప్రదమైన పెన్షన్ ప్రయోజనాన్ని కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పెన్షనర్ల కుటుంబాలు కనీస అవసరాలు తీరక అత్యంత దయనీయ బతుకులు వెల్లదీస్తున్నారని వాపోయారు. పెన్షనర్లు చేస్తున్న విజ్ఞప్తులు, ధర్నాలు, ఉద్యమాలు, ఆందోళనలు కేంద్ర ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి పెన్షన్ల హింస వేతనం పెంచాలని లేనిపక్షంలో దేశవ్యాప్త ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.టిఏపీ ఆర్ పిఎ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. రామారావు, జిల్లా వైస్ ప్రెసిడెంట్స్ జె. వెంకటరెడ్డి,ఎం. దేవేంద్రా చారి, ఎం సత్యన్నారాయణ పాటి,సెక్రటరీస్ బి ఎల్ నాయుడు,టి ప్రభాకరరావు, సినియర్ పెన్షనర్ లు తదితరులు పాల్గొన్నారు.

admin

Recent Posts

జిన్నారం సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డు సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని పటాన్‌చెరు…

1 day ago

సీఎం కప్ లో గీతం విద్యార్థికి మూడు బంగారు పతకాలు

పికిల్ బాల్ పోటీలలో ప్రతిభ చాటిన బీ.ఆర్క్. విద్యార్థిని ఆశ్రిత రాజు మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: గీతం డీమ్డ్…

1 day ago

ప్రజా సంక్షేమమే మా లక్ష్యం పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

54 మంది లబ్ధిదారులకు 24 లక్షల 43 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ మనవార్తలు ప్రతినిధి ,…

2 days ago

జిన్నారం శ్రీ జీవనజ్యోతి జ్యోతిర్లింగం క్షేత్రం అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామి వారి విగ్రహం, ధ్వజస్తంభ ప్రతిష్టాపన మనవార్తలు ప్రతినిధి , జిన్నారం: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో…

2 days ago

లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం పటాన్‌చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు: ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని లకడారం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్‌చెరు శాసన సభ్యులు…

2 days ago

నూతన కాలనీలలో సమస్యల పరిష్కారానికి కృషి పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

మనవార్తలు ప్రతినిధి , అమీన్పూర్ : అమీన్పూర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పడిన కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ…

2 days ago