_6 లక్షల రూపాయల సొంత నిధులచే గ్రామైక్య సంఘం సహాయకులకు ఏకరూప దుస్తులు, ఐడి కార్డుల పంపిణీ
పటాన్చెరు,మనవార్తలు ప్రతినిధి :
గ్రామస్థాయిలో మహిళా సంఘాల బలోపేతంలో కీలక భూమిక పోషిస్తున్న గ్రామైక్య సంఘం సహాయకులు (వివో ఏ) లకు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి చేయూతను అందించారు. నియోజకవర్గ పరిధిలోని జిహెచ్ఎంసి, మున్సిపాలిటీ, గ్రామాలలో పనిచేస్తున్న 200 మంది వివోఏ లకు 6 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన రెండు జతల ఏకరూప దుస్తులు, ఐడెంటి కార్డులను అందించారు. గురువారం సాయంత్రం పటాన్చెరు పట్టణంలోని ఐకెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పటాన్చెరువు మండల పరిధిలో పనిచేస్తున్న విఏవోలకు వీటిని అందజేశారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పోరేటర్ పుష్ప నగర్, ఐకెపి ఎపిఎం శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
గీతం కార్యశాల ప్రారంభోత్సవంలో ఐఐటీ భువనేశ్వర్ ప్రొఫెసర్ ఆశాభావం పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : భారతదేశం ప్రపంచ సెమీకండక్టర్…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో పేర్కొన్న మాజీ ప్రొఫెసర్ సి.రాఘవేంద్రరావు పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి : రాబోయే మూడు దశాబ్దాలు…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : పోలీసుల సేవలు మరువలేనివనీ కృష్ణ మూర్తి ఫౌండేషన్ చైర్మన్ కంజర్లకృష్ణ మూర్తి చారి అన్నారు.…
శేరిలింగంపల్లి ,మనవార్తలు ప్రతినిధి : తెలంగాణలో ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది.హైదరాబాద్ జిల్లా…
19 మంది లబ్ధిదారులకు 7 లక్షల 22 వేల రూపాయల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ పటాన్ చెరు ,మనవార్తలు…
అతి త్వరలో శాశ్వత ప్రాతిపాదికన పాలిటెక్నిక్ కళాశాల భవనం పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పటాన్ చెరు…