పటాన్చెరు ,మనవార్తలు ప్రతినిధి :
విద్యార్థి దశనుండే మానసిక ధైర్యం పెంపొందించుకోవాలని.. ప్రతి ఓటమి విజయానికి తొలిమెట్టు లాంటిదని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థుల కోసం ఏర్పాటుచేసిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ కేంద్రమైన పటాన్చెరులో నిరుపేద మధ్యతరగతి ప్రజల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించడంలో భాగంగా కేజీ నుండి పీజీ వరకు ప్రభుత్వ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోనూ ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు క్యాంపస్ ప్లేస్మెంట్స్ కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదగ్గ పరిణామం అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ ముందుకు వెళ్లాలని కోరారు. ఈ సందర్భంగా జస్ట్ డయల్,. పేటీఎం, టెక్ మహీంద్రా సంస్థలు నిర్వహించిన ఇంటర్వ్యూలో డిగ్రీ కళాశాలకు చెందిన 26 మంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. మీరందరికి ఎమ్మెల్యే జిఎంఆర్ చేతులమీదుగా ప్లేస్మెంట్ లెటర్లు అందించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్, ప్రవీణ, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: గీతం స్కూల్ ఆఫ్ ఫార్మసీ ‘పరిశ్రమ సంసిద్ధత’ పేరిట శుక్రవారం ఒకరోజు కార్యశాలను నిర్వహించింది.…
గీతం ఆతిథ్య ఉపన్యాసంలో జాతీయ భౌతిక ప్రయోగశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఆచంట వేణుగోపాల్ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: ఒక…
ప్రముఖ సినీనటి నివేతా పెతురాజ్ వికేర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు మనవార్తలు ప్రతినిధి , హైదరాబాద్ :…
సంప్రదాయాల సాంస్కృతిక గొప్పతనాన్ని ప్రదర్శించిన విద్యార్థులు\\ మనవార్తలు ప్రతినిధి , పటాన్చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో గురువారం సంక్రాంతి…
భారతి నగర్ డివిజన్లో 2026 డైరీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి రామచంద్రాపురం ,మనవార్తలు…
కేసీఆర్ కోటలో హస్తం హవా మెజార్టీ గ్రామాలలో కాంగ్రెస్ జయకేతనం గజ్వెల్ నియోజకవర్గ కాంగ్రెస్ సర్పంచ్ లకు ఘన సన్మానం…