Telangana

పటాన్ చెరు కేంద్రంగానే పటాన్ చెరు సర్కిల్ కార్యకలాపాలు

జిహెచ్ఎంసి కమిషనర్ ను కోరిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరు ,మనవార్తలు ప్రతినిధి :

దశాబ్దాల చరిత్రతో పాటు నియోజకవర్గ కేంద్రంగా కలిగిన పటాన్ చెరు డివిజన్ పరిధిలోని జిహెచ్ఎంసి పటాన్ చెరు సర్కిల్ కార్యాలయాన్ని స్థానికంగానే కొనసాగించాలని.. లేనిపక్షంలో ప్రజలతోపాటు పాలనాపరంగా తీవ్ర ఇబ్బందులు నెలకొంటాయని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్ వి కర్ణన్ ను పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.బుధవారం హైదరాబాదులోని బల్దియా ప్రధాన కార్యాలయంలో జిహెచ్ఎంసి కమిషనర్ తో ఎమ్మెల్యే జిఎంఆర్ సమావేశమయ్యారు. బల్దియా పునర్విభజన ప్రక్రియలో భాగంగా పటాన్ చెరు కేంద్రంగా ఏర్పాటుచేసిన బల్దియా సర్కిల్ కార్యాలయాన్ని ఇటీవల పరిపాలన సౌలభ్యం పేరుతో తెల్లాపూర్ పరిధిలోని మున్సిపల్ కార్యాలయం లోకి మార్చారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నియోజకవర్గ కేంద్రంతో పాటు ప్రధాన ప్రభుత్వ కార్యాలయాలు మొత్తం పటాన్ చెరుకేంద్రంగా సేవలు అందిస్తున్నాయని సర్కిల్ కార్యాలయాన్ని తెల్లాపూర్ కి మార్చడం ద్వారా పరిపాలనాపరంగా ఇబ్బందులతో పాటు పటాన్ చెరు, జేపీ కాలనీ, ముత్తంగి డివిజన్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పేర్కొన్నారు.పరిపాలన పరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆధునిక వసతులతో ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా గతంలోనే పటాన్ చెరు పట్టణంలో సర్కిల్ కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. నూతన సర్కిల్ ఏర్పడే వరకు సైతం పటాన్ చెరు కేంద్రంగానే పాత సర్కిల్ కార్యకలాపాలు కొనసాగాయని తెలిపారు తక్షణమే పటాన్ చెరు కేంద్రంగా సర్కిల్ కార్యకలాపాలు నిర్వహించేలా ఆదేశాలు జారీచేయాలని కమిషనర్ కర్ణన్ ను ఎమ్మెల్యే జిఎంఆర్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కమిషనర్ ప్రజలకు మెరుగైన పరిపాలన సేవలు అందించడమే తమ లక్ష్యమని అతి త్వరలో పటాన్ చెరు కేంద్రంగానే సర్కిల్ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపారు.

admin

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

16 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

17 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

1 day ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

1 day ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago