పలమనేరు లో సందడి చేసిన సినీతారలు
ఆగస్ట్ 14 నుండి 18 వరకు 0% మేకింగ్ ఛార్జెస్, 916 బంగారం తరుగు పై 40% తగ్గింపు
పాత బంగారం మార్పిడి పై ప్రతి గ్రాముకు 150 వరకు ఆదనం
మనవార్తలు ప్రతినిధి,పలమనేరు:
ప్రముఖ జ్యువెలరీ సంస్థ జిఎస్ఆర్ (GSR) జ్యువెలరీ సురేష్ బాబు & సన్స్ నూతన షోరూమ్ గ్రాండ్ ఓపెనింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి సినీ నటి నిధి అగర్వాల్ పాటు ఫెమినా మిస్ ఇండియా 2020 మానస వారణాసి ముఖ్య అతిథులుగా హాజరై తమ చేతుల మీదుగా షోరూమ్ను ప్రారంభించారు.బంగారం, వెండి, వజ్రాలు, యాంటిక్ జ్యువెలరీతో పాటు ఆధునిక డిజైన్లలో ప్రత్యేక కలెక్షన్లకు జిఎస్ఆర్ జ్యువెలరీ ప్రసిద్ధి చెందింది. పలమనేరు లోని లింగాయత్ స్ట్రీట్, న్యూ పెట్, ఎల్.ఎస్. స్ట్రీట్ లో నూతన స్టోర్ ప్రారంభంచేసారు.

ఒక ప్రీమియం బ్రాండ్గా వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రత్యేక డిజైనర్ ఆభరణాలను అందిస్తోంది. ఆధునికతతో కూడిన సంప్రదాయ డిజైన్లు, పెళ్లిళ్లు, వధూవరాల వేడుకలు మరయు ప్రత్యేక సందర్భాల కోసం విభిన్న కలెక్షన్లు ఈ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి.ఈ సందర్భంగా సంస్థ నిర్వహకులు సురేష్ బాబు & సన్స్ మాట్లాడుతూ మా వద్ద కొనుగోలు చేసే ప్రతి కస్టమర్కు ఇంటివాడిలా అనిపించే అనుభవాన్ని అందించడం మా లక్ష్యం. సంప్రదాయం మరియు నైపుణ్యాన్ని కలిపి అత్యుత్తమ ఆభరణాలను అందించడం మా గర్వకారణం. ముత్యాల నగరం పలమనేరు ప్రజలకు సేవ చేయడానికి మేము ఎంతో ఆసక్తిగా ఉన్నాము అని తెలిపారు .

