గీతంలో అనువాదంపై జాతీయ కార్యశాల

Telangana

వక్తలుగా ప్రముఖ విద్యా సంస్థల ప్రొఫెసర్లు

సదస్యులుగా పాల్గొంటున్న ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ (జీఎస్ హెచ్ఎస్)లోని ఆంగ్ల, ఇతర భాషల విభాగం ఆధ్వర్యంలో ‘అనువాదం: చరిత్ర, తేడాలు, పునరుద్ధరణలు’ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల జాతీయ వర్క్ షాపును డైరెక్టర్ ప్రొఫెసర్ సన్నీ జోస్ బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. దీనిని సద్వినియోగం చేసుకోవాలని సదస్యులకు సూచించారు.ఈ రంగంలోని ప్రముఖ పండితులు, నిపుణులను ఒకచోట చేర్చిన ఈ కార్యశాలలో హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి విశిష్ట పూర్వ ప్రొఫెసర్లు అల్లాడి ఉమా, ఎం.శ్రీధర్; మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ జె.బాలసుబ్రమణ్యం; పశ్చిమ బెంగాల్ రాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ; స్వతంత్ర స్కాలర్. అనువాదకురాలు, కార్యకర్త వి.గీత వంటి గౌరవనీయమైన వ్యక్తులు ప్రధాన వక్తలుగా పాల్గొంటున్నారు.

ప్రారంభ కార్యక్రమంలో ప్రొఫెసర్ ఉమా, ప్రొఫెసర్ శ్రీధర్ ‘అనువాదం, చర్చలు, సమస్యలు, సవాళ్లు’, ‘అనువాద సాధనలో గుర్తింపులు, తేడాలు, మార్జినాలిటీలు’ అనే అంశాలపై ఆలోచింపజేసే ఉపన్యాసాలు ఇచ్చారు. ‘తమిళ కుల వ్యతిరేక రచన: ఆలోచనలు, అనువాద నెట్ వర్క్’ అనే సెషన్లో డాక్టర్ బాలసుబ్రమణ్యం భాష, సామాజిక న్యాయం యొక్క ఖండనలను వివరించారు.‘స్త్రీవాద అభ్యాసంగా అనువాదం: పదాలు, వ్యక్తీకరణలతో పోరాటాలను లెక్కించడం’, ‘ఆంగ్లంలోకి పాఠాలను అందించడం గమనికలు, వ్యాఖ్యానాలకు మించి ఎంత సందర్భం అవసరం?’ అనే అంశాలను వి.గీత విపులీకరించారు. ‘భాష, ఆపదలు’, ‘మౌఖికం, మార్జినాలిటీ, ఉనికిలో లేని ఆర్కైవ్’ అనే అంశాలపై ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ ప్రసంగించడంతో పాటు కీలకమైన భాషాపరమైన ఆందోళనలను ప్రస్తావిస్తారు.

ఢాక్టర్ జోజ్ ధేల్ రాహుల్ హిరామన్, డాక్టర్ సుష్మితా పరీక్, డాక్టర్ ప్రతిమ్ దాస్ ఈ వర్క్ షాపును నిర్వహిస్తున్నారు. ఆంగ్ల, ఇతర భాషల విభాగాధిపతి డాక్టర్ సయంతన్ మండల్, విశిష్ట అతిథులను హృదయపూర్వకంగా స్వాగతించి, కార్యక్రమం ప్రధాన ఉద్దేశం, లక్ష్యాలను వివరించారు.గొప్ప చర్చలు, మేధోపరమైన కార్యకలాపాలతో, సాంస్కృతిక కథనాలు, చరిత్రలను రూపొందించడంలో అనువాద పాత్రపై అర్థవంతమైన సంభాషణను పెంపొందిస్తోన్న ఈ కార్యశాలలో హైదరాబాద్, ఢిల్లీ, మద్రాసు, పాండిచ్చేరి, కలకత్తా విశ్వవిద్యాలయాలతో పాటు ఇఫ్లూ, ఐఐటీ మద్రాసు వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుంచి దాదాపు 38 మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఇది విజయవంతంగా ముగిశాక, ఇందులో పాల్గొన్న వారందరికీ ధ్రువీకరణ పత్రాలను ప్రదానం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *