Telangana

గీతమ్లో దళితుల రచనలపై జాతీయ సదస్సు

పటాన్‌చెరు ,మనవార్తలు ప్రతినిధి :

గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సెన్సైస్ (జీఎస్ హెచ్ఎస్) ఆధ్వర్యంలో ‘వ్యవహారిక పత్రికలు, దళిత రచనలు, వెలువరించడంలోని సాధక బాధకాలు’ అనే అంశంపై మార్చి 1-3 తేదీలలో జాతీయ సదస్సును . నిర్వహించనున్నారు. మెస్తూర్లోని భారతీయ భాషలు కేంద్ర సంస్థ; దళిత సాహిత్యాన్ని రాయడం, విశ్లేషించడం, అనువదించడాన్ని సమన్వయం చేస్తున్న సంస్థల (కళలు, మానవీయ శాస్త్రాల పరిశోధనా మండలి, నాటింగ్ హామ్ బ్రెంట్-పాల్ వాలెరీ విశ్వవిద్యాలయాల) సహకారంతో దీనిని నిర్వహిస్తున్నట్టు సదస్సు సమన్వయకర్త డాక్టర్ శాంతన్ మండల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.దళిత సాహిత్య ప్రపంచం రావడానికి, వర్గ, జాతిపై విభిన్న సామాజిక-రాజకీయ చర్చలను ప్రసారం చేసిన వివిధ భారతీయ భాషా పత్రికలలో పనిచేసేవారు, పరిశోధక విద్యార్థులు, బోధకులను ఈ సదస్సు ఆహ్వానిస్తోందన్నారు.వివిధ కులాలు, భాషల మధ్య జరుగుతున్న సంభాషణలు, ఆలోచనల మార్పిడి, స్వీయ శోధన, ఆత్మ : పరిశీలనను ఈ సదస్సు ప్రోత్సహిస్తున్నట్టు డాక్టర్ శాంతన్ చెప్పారు. పత్రికా పరిశ్రమ, దేశీయ పత్రికలు, భాష, జాతి జాతీయత, కులం, జానపద కళా ప్రక్రియలు వంటి అంశాలపై ఔత్సాహికులు పత్ర సమర్పణ చేయొచ్చన్నారు. ప్రొఫెసర్ టి.ఎం. యేసుదాసన్, జేవీ పవార్, కళ్యాణి ఠాకూర్ చరల్, నకుల్ మాలిక్, ప్రొఫెసర్ రేఖా మొషామ్,ప్రొఫెసర్ జె.బాలసుబ్రహ్మణ్యం, ప్రొఫెసర్ రాజ్ కుమార్ హన్స్, హరీష్ మంగళం, ప్రొఫెసర్ సిప్రా ముఖర్జీ, ప్రొఫెసర్పి. తిరుమల్, ప్రొఫెసర్ సౌమ్య దేవమ్మ వంటి ప్రముఖ వక్తలు ఈ సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు, తను పేర్ల నమోదు, ఇతర వివరాల కోసం డాక్టర్ జోంధాలే రాహుల్ హిరామన్ thiraman:@gilam.edu / smonda@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని సూచించారు..

admin

Recent Posts

బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న చిట్కుల్ కాంగ్రెస్ ముఖ్య నేతలు

మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: చిట్కుల్ గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీతో కలిసి పనిచేయాలనే ఆసక్తిని కాంగ్రెస్…

6 hours ago

నేటి నుండి బిఆర్ఎస్ పార్టీ పోరు బాట

సెప్టెంబర్ 2వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ అంశాలపై నిరసన కార్యక్రమాలు, బాకీ కార్డు ఉద్యమం  ప్రజల…

6 hours ago

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న యువ షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటర్

తెలంగాణ ఐస్ స్టార్ ప్రణవ్ మాధవ్ సురపనేని ఘనత మనవార్తలు ప్రతినిధి,మియాపూర్: తెలంగాణ నేల నుంచి అంతర్జాతీయ ఐస్ స్కేటింగ్…

7 hours ago

సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపి ఎస్ పథకాన్ని పునరుద్ధరించాలి టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి

టిజి ఈ జె ఏ సి ఆధ్వర్యంలో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: సిపిఎస్ విధానం రద్దు…

7 hours ago

బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నేతల దాడిని ఖండిస్తూ శాంతియుత నిరసన

మనవార్తలు ప్రతినిధి - శేరిలింగంపల్లి : తెలంగాణ బీజేపీ శాఖ పిలుపు మేరకు నిన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై యూత్…

7 hours ago

అప్పగించిన పని పూర్తికి ముందుండాలి

గీతం విద్యార్థులకు ఉద్బోధించిన నౌకాదళ కమోడోర్లు జితేంద్రన్, బి.ఆర్. రాజు మనవార్తలు ప్రతినిధి,పటాన్‌చెరు: నాయకత్వం ప్రాముఖ్యతను వివరిస్తూ, అప్పగించిన పనిని…

7 hours ago