Hyderabad

మిస్టర్  సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 హైద‌రాబాద్‌కు చెందిన ప్రీత‌మ్ క‌ళ్యాణ్‌

హైదరాబాద్

హైదరాబాద్ 1 డిసెంబర్ 2021: ఇటీవల గోవాలో జరిగిన మిస్టర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 ని హైదరాబాద్ కు చెందిన మోడల్ ప్రీతమ్ కళ్యాణ్ గెలుచుకున్నారు.జెస్సీ విక్టర్ , ర‌జ్నామొహ‌మ్మద్‌ల ఆధ్వ‌ర్యంలో కొన‌సాగుతున్న దుబాయ్ మరియు భారతదేశం ఆధారిత కంపెనీ అయిన RageNyou  ఆధ్వర్యంలో  కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మంగళవారం ఇక్కడ విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. ఈ కంపెనీ ఆధ్వ‌ర్యంలో గోవాలో నిర్వ‌హించిన అతిపెద్ద & ప్రతిష్టాత్మక ఈవెంట్‌లలో మిస్ట‌ర్ సూప‌ర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021ని ఒక‌టి.

ప్రీతం కళ్యాణ్ మిస్టర్ సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 టైటిల్‌ను గెలుచుకున్నారు, మిస్టర్ వరల్డ్ రోహిత్ ఖండేల్‌వాల్‌చే ఈ అవార్డును అందుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ఈ అవార్డును ద‌క్కించుకోవ‌డం ఎంతో గర్వంగా ఉంద‌న్నారు. ఈ పోటీలో 20కి పైగా నగరాల నుండి 120 మందికి పైగా పోటీదారులు పోటీలో పాల్గొన్నారు.

మిస్టర్ ఇండియా సూపర్ మోడల్  ఆఫ్ ఇండియా- 2021 ప్రీతమ్ కళ్యాణ్ మాట్లాడుతూ.. “ఆత్మ‌విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు మార్పును తీసుకురావడానికి అందాల వేదిక ఒక గొప్ప వేదిక అన్నారు. అందంగా ఉండటంతోపాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటమే కాకుండా కొత్త ప్రతిభను ఎల్లప్పుడూ ప్రోత్సహించేందుకు ఇలాంటి వేదిక‌లు ఉప‌యోగ‌ప‌డుతాయ‌న్నారు. మిస్ట‌ర్ ఇండియా సూపర్ మోడల్ ఆఫ్ ఇండియా 2021 అనేది కేవలం అందాల పోటీ మాత్రమే కాద‌ని, పరివర్తన మరియు స్వీయ-అభివృద్ధి యొక్క ప్రయాణ‌మ‌ని అన్నారు. ఈ వేదిక ఎంతో మంది ఔత్సాహికుల‌కు స‌రైన వేదిక‌గానిల‌వ‌డ‌మే కాకుండా దేశంలో ఒక ప్ర‌త్యేక గుర్తింపును అందిస్తుంద‌న్నారు. ఈ అవార్డు సాధించ‌డం త‌న‌కు ఎంతో ఉత్సాహాన్ని నింపింద‌న్నారు.

Ramesh

Recent Posts

ప్రముఖ సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ లైవ్ కాన్సర్ట్‌కు ఏప్రిల్ 26న బౌల్డర్ హిల్స్‌లో

మనవార్తలు ప్రతినిధి ,హైదరాబాద్: హారిస్ జయరాజ్ మరియు కారుణాయా గారితో కలిసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే కాన్సర్ట్ గురించి వివరాలు…

19 hours ago

సమానత్వం కోసం పోరాడిన తత్వవేత్త జ్యోతిరావు పూలే

ఆయన ఆశయాలు స్పూర్తి దాయకం  నీలం మధు ముదిరాజ్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : మనుషులంతా అన్ని రంగాల్లో…

20 hours ago

ఘనంగా కేఎస్ పీపీ 4వ స్నాతకోత్సవం

మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ పూర్వ సీఈవో 35 మంది పట్టాల ప్రదానం…

2 days ago

క్రీడలు నిత్య జీవితంలో భాగం కావాలి పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

భానూరులో ఘనంగా ప్రారంభమైన టంగుటూరి అంజయ్య స్మారక క్రికెట్ టోర్నమెంట్ మనవార్తలు ప్రతినిధి , పటాన్‌చెరు : ప్రస్తుత పోటీ…

2 days ago

గుమ్మడిదల రైతులకు న్యాయం చేయండి

భూములు అందించిన ప్రతి రైతుకు వంద గజాలు కేటాయించండి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్యను కోరిన ఎమ్మెల్యే జిఎంఆర్ మనవార్తలు…

3 days ago

· కాలుష్యం మాకు.. రోగాలు మాకూ.. అభివృద్ధి మీకా

సిఎస్ఆర్ నిధుల తరలింపు పైన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆగ్రహం స్థానిక పరిశ్రమల  సిఎస్ఆర్ నిధులు స్థానిక…

3 days ago